Trinayani February 7 2024 Episode 1157: చాలా రోజుల తర్వాత ఆసక్తికరమైన విషయం ఒకటి తెలిసింది మీ కన్న తల్లి గురించి మీ సొంత భార్య అయిన నైని గారికి కూడా తెలియకూడదు అనుకోవడం అని సుమన అంటుంది. సుమన అలాంటిదేమీ లేదు అని విశాల్ అంటాడు. ఎందుకు గాయత్రి అత్తయ్య గారి గురించి మా అక్కకు తెలియకూడదు అనుకుంటున్నారు సెలవిస్తారా బావగారు అని సుమన అంటుంది. చూపులమ్మ తల్లి మా అమ్మ జడ వాళ్లకి చూపిస్తుంది వాళ్ల ప్రయత్నం వాళ్లు చేస్తున్నారు అని విశాల్ అంటాడు. మీ అమ్మ ఎక్కడుందో నీకు తెలుసా బావగారు అని సుమన అంటుంది. తెలియదు ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నాను అని విశాల్ అంటాడు.
తిలోత్తమ అత్తయ్య వాళ్ళు సఫలం అయితే నాకు వచ్చే లాభమేంటి బావగారు అని సుమన అంటుంది. ఎంత కావాలి అని విశాల్ అంటాడు. నేను డబ్బులు ఏమి అడగను అని సుమన అంటుంది. సుమన అమ్మ దీపం వెలిగించబోతుంది అని విశాల్ అంటాడు. చూపులమ్మ తల్లి దారి చూపిస్తుందని అందరూ అనుకుంటున్నారు మీ కన్నతల్లి జాడ తెలియకూడదని మీరు అనుకుంటున్నారు అలా జరగకూడదు అంటే కొన్ని తెలివితేటలు నాకు ఉన్నాయి బావగారు అని గుల్బర్ చూపెడుతుంది సుమన. దీనితో ఆ కలశాన్ని ఎగరగొడతాను అని సుమన వెళ్తుంది. కట్ చేస్తే, దీపం వెలిగించబోతూ ఉండగా సుమన గుల్బర్ లో గోలి పెట్టి గురి చూసి కలశాన్ని కొడుతుంది. కలశం కింద పడిపోయి నీళ్లు కళ్ళల్లో పడి కళ్ళు మంట అని అరుస్తుంది తిలోత్తమ. అమ్మ ఏమైంది అమ్మ అని విశాల్ అంటాడు. చూపులమ్మ తల్లి కింద పడుపోగానే మంట అని అరుస్తుంది అత్తయ్య అని నైని అంటుంది. చూపులమ్మ తల్లి నీ కింద పడేస్తే ఇలాగే చేస్తుంది అని హాసిని అంటుంది.
గాయత్రీ ఫోటో పట్టుకొని క్షమాపణ అడిగితే సరిపోతుంది అని డమ్మక్క అంటుంది. ఫోటోనే కింద పడేసేలా ఉన్నారు వద్దు పేరు పెట్టుకున్న గాయత్రి పాప కాళ్లు పట్టుకుంటే తగ్గిపోతుంది అని హాసిని తీసుకువెళ్లి గాయత్రి పాప పాదాల దగ్గర తిలోత్తమని పెడుతుంది. అమ్మ చెప్పమ్మా ప్రాణం పోయేలా ఉంది అని వల్లభ అంటాడు. తప్పైపోయింది అని కాళ్లు పట్టుకొని అంటుంది తిలోత్తమ. అక్క పేర్లో ఏదో మ్యాజిక్ ఉంది చూసావా మంట తగ్గిపోయింది అని పావన మూర్తి అంటాడు. ఇలాంటి ప్రయోగాలు ఎందుకు వదిన ప్రాణాల మీదికి వచ్చింది అని దురంధర అంటుంది. కట్ చేస్తే, మమ్మీ కళ్ళు మంట అన్నావు కదా ఈ పౌడర్ చల్లితే తగ్గిపోతుంది అని వల్లభ అంటాడు. చూపులమ్మ తల్లి దగ్గర దీపం పెడుతూ ఉంటే కలశం ఎలా ఎగిరింది అని తిలోత్తమ అంటుంది. అవును మమ్మీ నువ్వు దీపం పెడుతుంటే నీళ్లు ఎగిరి నీ మీద ఎలా పడ్డాయి అని వల్లభ అంటాడు. చూపులమ్మ తల్లి కింద పడడం వెనక మంత్రం తంత్రం ఏమీ లేదు అని తిలోత్తమ అంటుంది. గాయత్రి పెద్దమ్మ చేసిందంటావా అని వల్లభ అంటాడు. చిన్నపిల్లగా ఉన్న గాయత్రి అక్క ఇంటికి వస్తే తిరిగి వెళ్ళడం అంత సులువు కాదు అని తిలోత్తమ అంటుంది.
అరే శత్రువులమైన మనమే తను వెళ్ళొద్దని అనుకుంటున్నాం కానీ ఇంట్లో ఎవరో వద్దనుకుంటారు అని వల్లభ అంటాడు. ఈ చీర కట్టుకుంటే గాయత్రి అక్క లాగా ఉంటాను అనుకున్నాను కానీ నేనే ఉండనేమో అని అర్థం అయింది అని తిలోత్తమ అంటుంది. ఆ చీరను పడేయి మమ్మీ అని వల్లభ అంటాడు. రేపు విశాల్ ఈ చీరలు తిరిగి తీసేసుకుంటాడు అని తిలోత్తమ అంటుంది. అయితే గాయత్రి పెద్దమ్మ జాడ మనం తెలుసుకోలేమ అని వల్లభ వల్లభ అంటాడు. అఖండ స్వామిని వెళ్లి వెంటనే కలవాలి అని తిలోత్తమ అంటుంది. కట్ చేస్తే, బావగారు ఇందులో పాలు తెచ్చాను చక్కెర వేయాలో తెలియక తేలేదు అని సుమన అంటుంది. నైని త్తేస్తుందిలే అని విశాల్ అంటాడు. మీరు ఇంకోలాగా ఊహించుకోకండి బావగారు మీరు చేయబోయే సహాయానికి ఉడుత భక్తి అని సుమన అంటుంది. బావ అంటే మరదల్ని సొంత బిడ్డలా చూసుకునే మనస్తత్వం నాది అని విశాల్ అంటాడు. మీ మటలని ముందు తరం వాళ్లు పాటలుగా నేర్చుకున్న బాగుండు అని సుమన అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అన్నయ్య ముందు ఆని విక్రాంత్ అంటాడు.
సుమన ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం నువ్వు వెళ్ళు అని విశాల్ అంటాడు. బ్రో తనతో నువ్వు మాట్లాడవేంటి నీతో మీటింగ్ ఏర్పాటు చేయమని విదేశీయులు వచ్చి హోటల్లో ఉన్నారు అని విక్రాంత్ అంటాడు. విక్రాంత్ నేను కంపెనీ ఫైల్స్ చూస్తుంటే వాటి గురించి తెలుసుకోవడానికి వచ్చింది రా అని విశాల్ అంటాడు. కంపెనీ గురించి అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది బావగారు అని సుమన అంటుంది. కంపెనీ గురించి ఎవరికి అర్థం కాదు అలాంటిది నీకు తెలుస్తుందా అని విక్రాంత్ అంటాడు. తెలుసుకోవాలని ఆత్రుతగా ఉంది అని సుమన అంటుంది.బ్రో ఇది బుర్ర పాడు చేస్తుంది లైట్ తీసుకో నువ్వెళ్ళు అని విక్రాత్ తనని తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, విశాల్ గన్ను తీసి జోబులో పెట్టుకుంటూ ఉంటాడు. బాబు గారు మిమ్మల్ని వెతుకుతున్నాను అని నైని అంటుంది. ఎందుకు అని విశాల్ అంటాడు. తిలోత్తమ అత్తయ్య వాళ్ళు బయటికి వెళ్తే చెప్పమన్నారు కదా వాళ్ళు ఇప్పుడే వెళ్లారు అని నైని అంటుంది.ఎక్కడికి వెళ్లారు అని విశాల్ అంటాడు. ఎక్కడికి వెళ్లారో తెలియదు కానీ చూపులమ్మ తల్లిని తీసుకువెళ్లారు అని హాసిని అంటండి. నేను దారి మధ్యలో కలుస్తా నైని మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అని హాసినితో అంటాడు విశాల్. సరే పాపని నేను చూసుకుంట కానీ మీరు జాగ్రత్తగా వెళ్లి రండి బాబు అని నైని అంటుంది.
సరే అని విశాల్ వెళ్ళిపోతాడు. అక్క ఈరోజు వంట లోని సహాయం కావాలి అని నైని అంటుంది. తినే వాళ్ళందరూ బయట తిరుగుతున్నప్పుడు వంట చేసి లాభం ఏంటి చెల్లి అని హాసిని అంటుంది. అలా అని తప్పించుకోవద్దు అక్క ఈరోజు వంట నువ్వే చేయాలి అని నైని అంటుంది. కట్ చేస్తే, అఖండ స్వామి ధ్యానం చేస్తూ ఉంటాడు. స్వామి స్వామి అని తిలోత్తమ పిలుస్తుంది. కళ్ళు తెరిచిన అఖండ స్వామి ఏంటది అని అంటాడు. చూపులమ్మ తల్లి అని వల్లభ అంటాడు. ఏంటి అలా చేశారు గాయత్రి జాడ తెలుసుకోలేదా అని అఖండ స్వామి అంటాడు. ఒక్క దెబ్బతో చూపులమ్మ తల్లి ఎగిరి ఎక్కడో పడింది అని వల్లభ అంటాడు. అయితే ఆ పని మీ ఇంట్లో వాళ్ళు చేసి ఉంటారు అని అఖండ స్వామి అంటాడు. అక్కజాడ తెలియాలని అందరూ అనుకుంటారు కానీ ఇంట్లో వాళ్ళు అలా ఎందుకు చేస్తారు అని తిలోత్తమ అంటుంది. సుమన స్వార్థం అలా చూపులమ్మ తల్లిని ఎగిరిపడేలా చేసింది అని విశాల్ అనుకుంటాడు. విశాల్ వచ్చింది అత్తయ్య వాళ్లకు తెలియదు నేను వచ్చింది ఇంట్లో వాళ్లకి ఎవరికీ తెలియదు అని హాసిని అనుకుంటుంది. గాయత్రి పునర్జన్మ ఎత్తింది అది తెలియకూడదని ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు తిలోత్తమాఅని అఖండ స్వామి అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది