AP Budget 2024: ఏపీ అసెంబ్లీ 2024 -25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయిదేళ్లుగా బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు.
2024 – 25 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.2,86,389 కోట్ల అంచనాతో బడ్జెట్ ను మంత్రి ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో ఏపీని సంపన్న ఆంధ్రగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, అంబేద్కర్ లాంటి దార్శనికుల ఆలోచనలతో తమ ప్రభుత్వం పాలన సాగిస్తొందని చెప్పారు. రాష్ట్ర సమస్యలను పాత, మూస పద్ధతులతో కాకుండా సరికొత్త విధానాన్ని అవలంబించామన్నారు.
పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌర సేవలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. పాలనా విభాగాలను పునర్ వ్యవస్థీకరించి అన్ని వ్రగాల వారికీ సాధికారిత అందించామన్నారు. విద్యార్ధులను ప్రపంచ స్థాయి పోటీకి సిద్దం చేసేలా ఆంగ్ల మాధ్యమ విద్యను తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.
వెయ్యి పాఠశాలల్లోని 4,39, 395 మంది విద్యార్ధులకు సీబీఎస్ ఈ పరిధిలోకి తీసుకువచ్చామన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ పాఠ్యప్రణాళిక, ప్రతి విద్యార్ధికీ టోఫెల్ దృవీకరణ పత్రాన్ని అందించేలా ప్రయత్నం, కొత్త పారిశ్రామిక విధానంతో సంపన్న ఆంధ్రా, రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ చట్టాలతో భూభద్ర ఆంధ్రాగా ఏపీ మారిందని అన్నారు.
అన్ని రంగాలను అభివృద్ధి దిశగా పయనించేలా చర్యలు తీసుకున్నామని మంత్రి బుగ్గన తెలిపారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా అనేక మంది అబ్దిదారులకు ఆర్థిక సాయం అందించి ఈ ప్రభుత్వం ఆసరగా నిలిచిందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో మహిళలను సమాన భాగస్వామ్యులను చేశామన్నారు. విద్య, వైద్య రంగాలలో తమ ప్రభుత్వం కనపర్చిన శ్రద్ధ గతంలో మరే ప్రభుత్వం కనపర్చలేదని తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సంక్షేమ పథకాలను పార్టీ, కుల, మత, ప్రాంతాల తేడా లేకుండా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందరికీ అందేలా చూడగలిగామని అన్నారు. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా అనేక ప్రయోజనాలను అందించామని తెలిపారు.
బడ్జెట్ ముఖ్యాంశాలు
- రూ.2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం
- రూ.30,530 కోట్ల మూల ధన వ్యయం
- రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు
- రూ.55,817 కోట్ల ద్రవ్య లోటు అంచనా
- రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.51 శాతం మేర ద్రవ్య లోటు
- జీఎస్డీపీలో 1.56 శాతం మేర రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా ..
2024 – 25 ఆర్ధిక సంవత్సరంలో రూ.2,05,352 కోట్ల రెవెన్యూ రాబడి వస్తుందని బడ్జెట్ లో ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది.
- కేంద్ర పన్నుల ద్వారా రూ.49,286 కోట్లు రాబడి వస్తుందని అంచనా
- రాష్ట్ర పన్నుల ద్వారా రూ.1,09,538 కోట్లు వస్తుందని అంచనా
- పన్నేతర ఆదాయంగా రూ.14,400 కోట్లుగా అంచనా
- గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా రూ.32,127 కోట్లు వస్తుందని అంచనా
- బహిరంగ మార్కెట్ ద్వార రూ.71 వేల కోట్లు రుణ సేకరణ చేయాలని ప్రభుత్వ లక్ష్యం
- కేంద్రం నుండి రూ.61,642 కోట్ల రుణం తీసుకోవాలని ప్రభుత్వ యోచన
- ఇతర మార్గాల ద్వారా మరో రూ.25వేల కోట్ల అప్పు చేయాలని బడ్జెట్ లో ప్రతిపాదన
Video Viral: అమెరికాలో హైదరాబాదీ యువకుడిపై దుండగుల దాడి .. తీవ్ర గాయాలు .. ఇదిగో వీడియో