Trinayani April 23 2024 Episode 1220: నువ్వు పూజ చేస్తే గాయత్రి అక్క జాడ తెలియడం కాదు గాయత్రి అక్కే రావాలి అని తిలోత్తమ అంటుంది. సుమన నువ్వు రెండోసారి ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు అని విక్రాంత్ అంటాడు. మా అక్క గెలిచినప్పుడు చూద్దాంలే అని సుమన అంటుంది. నైని పూజ మొదలు పెట్టు అని విశాల్ అంటాడు. నైని తులసి అమ్మవారికి పూజ చేస్తుంది. పూజ చేసి హారతి ఇస్తుంది నైని. గాయత్రి అత్తయ్య జాడ తెలుస్తుంది చూడండి అని హాసిని అద్దం పట్టుకొని అమ్మవారికి ఎదురుగా నిలబడుతుంది. విశాల్ హాసిని చాటుకు వచ్చి నిలబడతాడు. అమ్మవారి మహిమతో ఒక కాంతి వచ్చి అద్దం మీద పడి గాయత్రీ పాప మీద పడుతుంది ఆ వెలుతురు. ఇంతలో పావన మూర్తి కూడా అద్దం పట్టుకొని ఆ వెలుతురుని ఆపుతాడు.
అలా ఇద్దరు అద్దాలు పట్టుకోవడం వల్ల వెలుతురు నాలుగు దిక్కుల ప్రసరిస్తుంది. ఆ వెలుతురు చూడలేక తిలోత్తమ వల్లభ సుమన కళ్ళు మూసుకుంటారు.దానితో గాయత్రి జాడ ఎవరికీ అర్థం కాకుండా పోతుంది. హాసిని అద్దాలు ఎందుకు పట్టుకున్నారు అద్దం పట్టుకోవడం వల్ల అమ్మవారు గాయత్రి జాడ చూపించడానికి ఒక వెలుతురు ప్రసరిస్తే ఆ వెలుతురు నాలుగు దిక్కుల ప్రసరించింది ఇప్పుడు గాయత్రి అక్క ఎటుపక్క ఉందని వెతకాలి అని తిలోత్తమ అంటుంది.అమ్మవారికి దిష్టి తగలకుండా పెట్టారు అని విక్రాంత్ అంటాడు. గాయత్రి అమ్మ గారి జాడ తెలుసుకునే అవకాశం దొరికింది అని నైని సంతోషిస్తుంది. కాంతి మాత్రమే వచ్చింది మా అక్క కన్నా తొలిబిడ్డ మాత్రం దొరకలేదు అని సుమన అంటుంది. కళ్ళు ఉంటే కనిపించేవి అని విక్రాంత్ అంటాడు. ఎవరికి తెలియాలో వాళ్లకు తెలుస్తుంది అని డమ్మక్క అంటుంది.కట్ చేస్తే, తిలోత్తమ వల్లభ అఖండ స్వామి దగ్గరికి వెళ్తారు. నమస్కారం గురువుగారు అని వల్లభ అంటారు.
విషయం ఏంటో చెప్పు వల్లభ అని అఖండ స్వామి అంటాడు. శిరస్సులేని ముండానికి పూజ చేశారు గురువుగారు అని వల్లభ అంటాడు. మూర్ఖుడా అర్థమయ్యేలా చెప్పు అని అఖండ స్వామి అంటాడు.ఏమీ లేదు గురువుగారు మా ఇంట్లో పూజ చేశారు శిరస్సులేని అమ్మవారిని చెప్పి తులసి తోటకి పూజ చేశారు ఆ పూజ చేయడం వల్ల ఆ చెట్లు చివరిలో నుంచి ఒక కాంతి వచ్చింది ఆ కాంతి గాయత్రి అక్క జాడని చూపిస్తుందని చెప్పారు కానీ అది నాలుగు దిక్కుల ప్రసరించడంతో గాయత్రి అక్క ఎటుపక్క ఉందో తేల్చుకోలేకపోతున్నాం అని తిలోత్తమ అంటుంది. ఆ కాంతి ఎటువైపు ఎక్కువగా వెళ్ళింది అని గురువుగారు అంటారు. తూర్పు వైపు గాయత్రి పాప ఉన్నది ఆ పాప సైడ్ వెళ్ళింది అని తిలోత్తమ చెబుతుంది. గాయత్రి అక్క జడ తెలుసుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని తిలోత్తమ అడుగుతుంది. అఖండ స్వామి విభూదినిచ్చి ఈ విభూది గాయత్రీ పటానికి గాయత్రీ పాప మొహానికి రుద్ది అద్దంలో గాయత్రి పాపను చూడమనండి అప్పుడు గాయత్రి జాడ తెలుస్తుంది అని గురువుగారు చెబుతారు. అలాగే స్వామి అంటూ తిలోత్తమ వల్లభ వెళ్ళిపోతారు.
కట్ చేస్తే, ఏంటి సుమన అలా చూస్తున్నావ్ అని విశాల్ అంటాడు. ఏమీ లేదు బావగారు మీ నుండి చిన్న క్లారిటీ కావాలి అని సుమన అంటుంది. ఏంటో చెప్పు అని విశాల్ అంటాడు. హాసిని అక్క పావన మూర్తి బాబా ఎందుకలా చేశారు నీకు ముందే తెలుసా అని సుమన అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ బ్రో మూడు పాడు చేయకు వెళ్ళిపో అని విక్రాంత్ అంటాడు. నన్ను వెళ్ళిపొమ్మనడం కాదు బావగారికి ముందే నిజం తెలుసేమో అనిపిస్తుంది అని సుమన అంటుంది. ఇంతలో నైని అక్కడికి వస్తుంది. అడుగు అక్క గాయత్రి పాప జాడ గురించి తెలుసుకోకుండా హాసిని అక్క పావనమూర్తి బాబా ఎందుకలా చేశారు అని సుమన అంటుంది.
బాబు గారిని అనుమానిస్తున్నావా అని నైని అంటుంది. కావాలని చేసింది కాదు కదా అని విశాల్ అంటాడు. అమ్మవారికి దిష్టి తగులుతుందని అలా చేశారు అని విక్రాంత్ అంటాడు. అద్దం అడ్డు పెట్టకపోతే ఆ కాంతి ఎటు ప్రసరించేది అని నైని అంటుంది. అద్దం అడ్డు పెట్టకపోతే గాయత్రి అత్త ఎటుపక్క ఉందో అటుపక్క ప్రసరించేది అని సుమన అంటుంది. కావాలని చేసింది అయితే కాదు అంత లోతుగా ఆలోచించాల్సిన పనిలేదు అని విశాల్ అంటాడు.
కావాలని చేశారా నిజం తెలుసుకోకూడదని చేశారా అని సుమన అంటుంది. కన్నతల్లి గురించి తెలుసుకోవాలని ఎవరికీ ఉండదు అని విక్రాంత్ అంటాడు. తెలుసుకోవాలని అనుకునే దానికి తెలియదు అనే దానికి తేడా లేదా అని సుమన అంటుంది..ఇంతలో నైని కి పోలీస్ ఆయనకి ఏదో అంతున్నట్టు కనిపిస్తుంది. పోలీసు అన్నకి ఏమీ కాకూడదు అని నైని అనుకుంటుంది.. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది