Trinayani February 10 2024 Episode 1160: మమ్మీ నేను కూడా దండం పెట్టినట్టు పెట్టి ఆ పిల్ల కాళ్ళు లాగేస్తాను చూడు అని వల్లభ అంటాడు. ఇక చాల్లే పడుకుండిపోయారా ఏంటి అని తురందర అంటుంది. మావయ్య ఇక లేవండి అని విశాల్ పావన మూర్తిని లేపుతాడు. పావనమూర్తి కన్నీళ్లు పెట్టుకుంటాడు. మామయ్య ఎందుకు ఏడుస్తున్నావ్ అని విశాల్ అంటాడు. నా మొగుడు ఏడుస్తుంటే మీకు సరదాగా ఉందా ఊరుకో పెట్టలేరా అని దురంధర అంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు కారణం చెప్పు బాబాయ్ అని హాసిని అంటుంది.సోదరి కాళ్లు పట్టుకొని మనసులో కోరుకోమన్నారు కదా అని పావన మూర్తి అంటాడు. ఏం కోరుకున్నావు అని తిలోత్తమ అంటుంది. సోదరా దురంధర తల్లి కావాలని కోరురాని కోరిక కోరావు కదా అని విశాలాక్షి అంటుంది.
అవును సోదరి అది జరగదని అమ్మవారే నాకు చెప్పినట్టు అనిపించింది అందుకే ఏడుపొచ్చింది అని పావనమూర్తి అంటాడు. బాబాయ్ మనసులో కోరుకున్నది విశాలాక్షి చెప్పేసింది అని హాసిని అంటుంది. ఆ విషయం అందరికీ తెలుసు ఆ పిల్ల చెప్పగానే దేవతల ఫీల్ అయిపోకండి అని వల్లభ అంటాడు. నువ్వేమైనా అనుకో అల్లుడు సోదరి పాదాలు తాకగానే బ్రహ్మాండమైన అనుభూతి కలిగింది నాకు అని పావన మూర్తి అంటాడు. ఆనందపడకుండా ఎందుకు ఏడ్చావు మరి అని సుమన అంటుంది. మా ఆయనని ఆటపటించింది చాలు అని పువ్వులు తీసుకొని విశాలాక్షి పాదాల దగ్గర పెట్టి నా మొగుడు ఇంకెప్పుడు ఏడవకూడదు అని దూరందర అంటుంది. అయితే నేను దండం పెట్టుకుంటాను అని వల్లభ అంటాడు. కోరిక కూడా బలంగా కోరుకోండి బావగారు అని సుమన అంటుంది. అమ్మ తీరుస్తుందిలే అని డమ్మక్క అంటుంది. ఇలా పువ్వులు వేసి ఈ విశాలాక్షి పాప అమ్మవారిని పాదాలు పట్టుకుంటున్నాను అని వల్లభ పాదాలని లగబోతే కదలవు.
ఇంకా బలంగా గట్టిగా ప్రయత్నిస్తాడు వల్లభ. వల్లభ అందరూ చూస్తున్నారు లేరా అని తిలోత్తమ అంటుంది. అన్నయ్య ఏం చేస్తున్నావ్ లే అని విశాల్ అంటాడు. రేయ్ చాలు లేరా అని తిలోత్తమ వచ్చి వల్లభ ని లేపుతుంది. వల్లభ మొహం ఎర్రబారడంతో అందరూ ఆశ్చర్యపోయి ఏమైంది అని అంటారు. ఒంట్లో రక్తం అంత మొహంలోకి వచ్చినట్టు ఇలా మారింది అని డమ్మ క్క అంటుంది. ఏం కోరుకున్నావు అల్లుడు అని పావన మూర్తి అంటాడు. చాలా బలంగా ఉంది పిల్ల అని వల్లభ అంటాడు. అలసిపోయావు కదా సేదతీరు అని వశాలక్షి అంటుంది. బాబు గారు మనిద్దరం పాదాలకు దండం పెడదామా అని నైని అంటుంది. నాకు ఏ కోరికలు లేవు అని విశాల్ అంటాడు. మీ అమ్మ దొరకొద్దా బావగారు అని సుమన అంటుంది.
తీరని కోరికను మరలా మరలా ఎందుకు కోరుకుంటారు అని ఎద్దులయ్య అంటాడు.నైనీ కడుపులో గాయత్రి అక్క పుట్టిందే కానీ ఇంటికి తిరిగి వస్తేనే కదా సంతోషించేది అని తిలోత్తమ అంటుంది. అంతా అమ్మవారు చూసుకుంటుందిలే అత్తయ్య అని విశాల్ నైని విశాలాక్షి పాదాలకి పూలు వేసి నమస్కారం చేసుకుంటారు. భక్తి భావాలతో పుణ్యక్షేత్రాలు తిరిగే నువ్వు బాగుండాలమ్మ ఇదే నా కోరిక అని విశాల్ అంటారు. చల్లగా చూసే అమ్మని ఇంకా చల్లగా ఉండమంటున్నావా అని విశాలాక్షి అంటుంది. విక్రాంత్ నువ్వు సుమన కలిసి దండం పెట్టుకోండి అని హాసిని అంటుంది. కలిసి దండం పెట్టుకోను ఒక్కదాన్నే పట్టుకుంటాను అని సుమన పువ్వులు తెచ్చి విశాలాక్షి పాదాల మీద పెట్టి వేళ్ళతో ఒత్తుతుంది. విశాలాక్షి పగలబడి నవ్వుతుంది. ఎందుకలా నవ్వుతున్నావమ్మా అని విశాల్ అంటాడు.
సుమన గిలిగింతలు పెడుతుంటే నవ్వొచ్చింది నాన్న అని విశాలాక్షి అంటుంది. నీకు చెక్కిలిగింతలు పెట్టలేదు నీకు పాదాలు పంటిన పసుపు పచ్చిగా ఉందా లేదా అని చూశాను అంతే అని సుమన అంటుంది. అంటిందా అని నైని అడుగుతుంది. నెత్తురు అంటుంది చూసుకో చిట్టి మాత అని ఎద్దులయ్య అంటాడు. తన చేయి చూసుకోగానే చెయ్యి అంతా రక్తం కనపడుతుంది. మొక్కుకున్నావ్ చిట్టి అని హాసిని అంటుంది. తను చేసిన చేష్టలకి రేపు రక్తం కళ్ళ చూస్తుంది అని విశాలాక్షి అంటుంది. రక్తం కాదు నా అదృష్టాన్ని చూస్తాను చూడు అని సుమన అంటుంది. చిన్నపిల్లని అలాగేనా చేసేది అని నైని అంటుంది. తను చిన్నపిల్ల కాదు మనల్ని భయపెడుతుంది అని సుమన అంటుంది. ఇష్టం లేకపోతే పట్టుకోకు కానీ విశాలాక్షిని తప్పు పట్టకు అని విశాల్ అంటాడు. సుమన చేసిన తప్పుకు క్షమించు అని హాసిని పువ్వులు వేసి దండం పెడుతుంది.
నువ్వు ఇంట్లో అడుగుపెట్టి అందరిని ఇబ్బంది పెడుతున్నావ్ అని సుమన అని తీసుకొని వెళ్ళిపోతుంది తిలోత్తమ. కట్ చేస్తే, తిలోత్తమ వల్లభ అఖండ స్వామి దగ్గరికి వస్తారు. మీరు చెప్పింది చూస్తుంటే మీ ఇంటికి వచ్చిన విశాలాక్షి మామూలు మంత్రగత్త కాదు అని అఖండ స్వామి అంటారు. అవును స్వామి తను ఎక్కడ అడుగులు వేస్తే అక్కడ పాదాలు పడుతున్నాయి అని తిలోత్తమ అంటుంది. రెండు కాళ్లు పట్టిలు పడేద్దామని చూశాను అని వల్లభ అంటాడు. అవి కాళ్లు కాదు రాళ్లు అని అఖండ స్వామి అంటాడు. ఏమో స్వామి గారడి పిల్ల ఏం పెట్టిందో తెలియదు ఎవరు గుర్తుపట్టడం లేదు అని వల్లభ అంటారు. సుమన పాదాలు పట్టుకుంది కదా మరి చెప్పలేదే అని సుమన చేసిన పనికి నవ్వింది అని తిలోత్తమ అంటుంది. నవ్విందా ఆశ్చర్యంగా ఉంది అని అఖండ స్వామి అంటాడు. గిల్లినా సుమనకి చేతికి రక్తం అందటు0ది స్వామి అని తిలోత్తమ అంటుంది. అయితే ఆ విశాలాక్షి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోండి మీకే మంచిది అని అఖండస్వామి అంటాడు. తన మాయను కనిపెట్టలేకపోతున్నాం స్వామి అని తిలోత్తమ అంటుంది ఈ తులసి వేరును ఆ విశాలాక్షి పడుకున్న చోట దిండి లోపల పెట్టండి ఆ విశాలాక్షి తులసి వేరు ఉన్న దిండు మీద తలపెట్టగానే లేచి అడుగులు వేస్తుంది తనువేసిన పశుపు పాదాల మీద వ్యతిరేకతను చూపించి మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తుంది అని అఖండస్వామి అంటాడు. ధన్యురాలిని స్వామి అని తిలోత్తమా ఆ వేరుని తీసుకొని వెళ్ళిపోతుంది.కట్ చేస్తే, తిలోత్తమ వల్లభ చాప దిండు పట్టుకొని ఒకచోట కి వెళ్తారు. వాళ్లని చూసిన సున్నాన వాళ్ళ వెనకాల వచ్చి ఏం చేస్తున్నారని చూస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది