Trinayani February 12 2024 Episode 1161: ఇక్కడ వెయ్యరా పక్క తొందరగా అని తిలోత్తమ అంటుంది. వల్లభ చాపపరిచి చాప మీద దిండు పెట్టి దిండులో తులసి మొక్కను పెడతాడు. ఇక్కడ ఏం చేస్తున్నారు మాత అని ఎద్దులయ్య అంటాడు.పరుపు మీద తప్ప మీకు కింద పడుకునే అలవాటు లేదు ఇక్కడ వల్లభ భావని పండుకో పెడతారా అత్తయ్య అని సుమన అంటుంది. ఈ చాప మీ విశాలాక్షి అమ్మకి వేస్తున్నాను తీసుకొచ్చి ఇక్కడ పడుకోమని చెపు ఎద్దులయ్య అని తిలోత్తమ అంటుంది. మా అమ్మ కోసం మీరు ఎందుకు పక్క వేస్తున్నారు మాత అని ఎద్దులయ్య అంటాడు.శివ భక్తురాలైన విశాలాక్షికి పక్క వేసి కాస్తయినా పుణ్యం సంపాదించుకుందామనుకుంటున్నాను ఎద్దులయ్య అని తిలోత్తమ అంటుంది. విశాలాక్షి ని ఇక్కడ పడుకోబెట్టు అంటూ తిలోత్తమ వాళ్ళు వెళ్ళిపోతారు. కట్ చేస్తే, విశాలాక్షి పడుకొని ఆ తరువాత తులసి మొక్క మత్తులో లేచి నడుస్తూ ఉండగా ఈ పాదాల మీద నడిపించాలిరా తన చేత గాయత్రీ అక్క జాడ చెప్పించాలి అని తిలోత్తమ అంటుంది.
ఇదా అత్తయ్య మీ ప్లాను మీ ప్లాన్ నేను సక్సెస్ కానివ్వను కదా అని సుమన విశాలాక్షి పొద్దున నీ పాదాలని కాస్తంత గిల్లానని నా చేతికి రక్తం వచ్చేలా చేస్తావా విశాలాక్షి ఇప్పుడు చూడు ఈ పాదాల మీద నువ్వు నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఈ గాజు పెంకులు కూర్చొని నువ్వు బాధపడడం చూసి నేను ఆనందించాలి అంటూ సుమన గాజు వక్కలు పసుపు పాదాల మీద పెడుతుంది. అమ్మకి సర్వం తెలుసు కదా నిజం చెప్పించడానికి ఇంత ప్రయత్నిస్తున్నారని తెలియదా అని డమ్మక్క అంటుంది. మనల్ని ఎందుకు మౌనంగా ఉండమందో మన ఊరుకుందాం డమ్మక్క అని ఎద్దులయ్య అంటాడు.విశాలాక్షి పడుకొనే లేచి మెల్లగా నడవడం మొదలు పెడుతుంది.రేయ్ పాపలేచింది పద పసుపు పాదాల మీద నడుపిద్దాం అని తిలోత్తమ వల్లభ వస్తారు. పాప నిన్ను మేము తీసుకువెళ్తాం రామ అంటూ వల్లభ తిలోత్తమ తన చేయి పట్టుకుంటారు. విశాలాక్షిని ఎక్కడికి తీసుకు వెళుతున్నారు అత్తయ్య అని హాసిని అడుగుతుంది.
గాయత్రి అమ్మ జాడ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మాత అని ఎద్దులయ్య అంటాడు. వదలండి తనను ఎక్కడికి తీసుకు వెళుతున్నారు అని హాసిని నెట్టేస్తుంది. రేయ్ దాన్ని పక్కకు నెట్టేయరా అని తిలోత్తమ అంటుంది. వల్లభ హాసినిని పక్కకు నెట్టేసి విశాలాక్షిని కిందికి తీసుకువస్తారు. చెల్లిని విశాల్ ని తీసుకొస్తాను ఉండండి అంటూ హాసిని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, పాప మేము చేతులు పట్టుకొని పసుపు పాదాల మీద నడిపిస్తూ ఉంటాము నువ్వు నడుస్తూ సమాధానం చెప్పాలి అని తిలోత్తమ ఉంటుంది. సరే అడగండి అని విశాలాక్షి అంటుంది. నువ్వు ఎవరు అని తిలోత్తమ అంటుంది. జగన్మాత ని అని విశాలాక్షి అంటుంది. అమ్మ ఊరు మాత్రం ఆడకు కైలాసం అని చెబుతుంది అని వల్లభ అంటాడు. నా ఊరు కైలాసమే అని విశాలాక్షి అంటుంది.చూసావా మమ్మీ అది కాకుండా గాయత్రి పెద్దమ్మ జాడ అడుగు అని వల్లభ అంటాడు. అది సరే పాప గాయత్రి అక్క ఎక్కడ ఉందో నీకు తెలుసా అని తిలోత్తమ అంటుంది.
ఉండాల్సిన చోటనే ఉంది అని విశాలాక్షి అంటుంది. ఇంతలో హాసిని నైని నీ విశాల్ ని తీసుకుని కిందికి వస్తుంది. వాళ్లు అలా నడిపిస్తూ ఉండగా విశాలాక్షి పాదాలకి గాజులు గుచ్చుకొని రక్తం అడుగులు పడతాయి అది చూసి హాసిని నైని ని కంగారు పడిపోతారు. ఆపండి అమ్మని ఎక్కడికి తీసుకు వెళుతున్నారు అని విశాల్ అంటాడు.ఆట ఆడుకుందామని తీసుకు వెళ్తున్నాం తమ్ముడు అని వల్లభ అంటాడు. ఇంత అర్ధరాత్రి వేళ ఆడపిల్ల తో ఏంమాటడుతావు అన్నయ్య అసలు నీకు బుద్ధుందా అని విశాల్ అంటాడు. అసలేంటి అన్నయ్య మీరు ఏం చేయాలనుకుంటున్నారు మందేమైనా తాగారా తాగింది దిగలేదా అని విక్రాంత్ అంటాడు. రేయ్ మీ ఇద్దరి కన్నా వల్లభ పెద్దవాడు అన్నయ్యతో అలాగేనా మాట్లాడేది అని తిలోత్తమ అంటుంది. ముందు మీరు పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండి అని నైని అడుగుతుంది. విశాలాక్షి పాదాలకి రక్తం కారుతున్న పట్టించుకోకుండా అలాగే తీసుకు వెళుతున్నారు అసలు మీరు మనుషులేనా అని విశాల్ అంటాడు. ఆ పాపకి రక్తం కారడం నేను చూడలేదు విశాల్ అసలు కాళ్ళకి రక్తం ఎలా వచ్చింది అని తిలోత్తమ అంటుంది. ఆ విషయం సుమనను అడగండి అమ్మ అని ఎద్దులయ్య అంటాడు. మీరే ఏదో ఒకటి చేసి ఉంటారు అని హాసిని అంటుంది.
నిజంగా మేము ఏమీ చేయలేదు ఆ పాదాల మీద నడిపిస్తున్నాం అంతే అని తిలోత్తమ అంటుంది. తనని పసుపు పాదాల మీద ఎందుకు నడిపించాలనుకుంటున్నారు అసలేం తెలుసుకోవాలి అనుకుంటున్నారు అని హాసిని అంటుంది. ఆ విషయం చిట్టి మాత నడగాలి మాత తిలోత్తమని అడిగితే ఏం చెబుతుంది అని ఎద్దులయ్య అంటాడు. చూడు సుమన ఎందుకు విశాలాక్షి పాదాలకి రక్తం వచ్చింది అని విశాల్ అంటాడు. ఇది మరీ బాగుంది నడిపించిన వాళ్ల నడక నన్ను అడుగుతారు ఏంటి అని సుమన అంటుంది. అయితే ఆ అడుగుల మించి నువ్వు నడువు చెల్లి అని నైని అంటుంది. వాటి మి0చి నడిస్తే గుచ్చుకుంటాయి అని సుమన అంటుంది. ఆ మాట వినగానే విక్రాత్ సుమన ని లాగిపెట్టి చెంప మీద ఒకటి ఇస్తాడు.
అలా కొట్టావేంటి విక్కీ అని దూరందర అంటుంది. పసుపు పాదాల మీద నుంచి నడవమంటే రక్తం అంటుకుంటుందేమో అనాలి కాని గుచ్చుకుంటున్నాయి అంటే అప్పుడే అర్థమైపోయింది అత్తయ్య ఇదే ఏదో చేసి ఉంటుంది ఏం చేసావ్ చెప్పు అని విక్రాంత్ అంటాడు. చూడు చెల్లి ఏం చేయాలనుకున్నావో మర్యాదగా చెప్పు లేదంటే బాగోదు అని నైని అంటుంది.పొద్దున విశాలాక్షి పాదాలు గిలినందుకు నాకు రక్తం వచ్చేలా చేసిందని తనని తిలోత్తమ అత్తయ్య వాళ్ళు నడిపిస్తున్నారని ఆ పాదాల మీద గాజు పెంకులు పెట్టాను అని సుమన అంటుంది.విశాలాక్షి అంత బాధను ఓర్చుకొని ఎలా నడిచావమ్మా అని విశాల్ అంటాడు. తులసి చెట్టుకి పూజ చేసి వచ్చారు కదా నాన్న భక్తిపారవశంలో నడిచాను అయినా,నిజం తెలియాలని ఓర్చుకున్నాను నాన్న అని విశాలాక్షి అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది