Trinayani February 9 2024 Episode 1158: ఎందుకలా అంటున్నావ్ డమ్మక్క అని విశాల్ అంటాడు. దేవాలయం లాంటి ఇంట్లో ఉన్న మనుషుల మనుషుల్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తెలిస్తే జరిగేది రక్తపాతమే కదా బాబు అని డమ్మక్క అంటుంది. బాగా ఉన్న ఇంట్లో సంతోషంగా ఎవరున్నారని అని విక్రత్ అంటాడు. ఆ లోటు నాకు ఉండేది నిన్నటి వరకు రేపటి నుంచి ఉండదు అని సుమన అంటుంది. ఎందుకు ఉండదు అని నైని అంటుంది. నువ్వే చూస్తావ్ కదా అంటూ సుమన వెళ్ళిపోతుంది. తన ఆట మొదలుపెట్టింది ఎలా ఆడుతుందో చూడాలి మరి అని డమ్మక్క అంటుంది. కట్ చేస్తే, వల్లభ బయట కూర్చుని కాకుల కొడుతూ ఉంటాడు. కాకులతో మీకేం పని అండి ఇంతకు మీకు క్లారిటీ వచ్చిందా అని హాసిని అంటుంది. ఏంటది అని వల్లభ అంటాడు. కుడికాలు బాగుందా ఎడమ కాలు బాగుందా దరిద్రపు కాలు పెట్టి లోపలికి వచ్చావు కదా అని హాసిని అంటుంది.
నా కొడుకుని అలా అంటావేంటే అని తిలోత్తమ అంటుంది. ఆడదానికి ఒక రూలు మగవాడికి ఒక రూలా ఆడది లోపలికి అడుగుపెడితే కుడికాలు పెట్టి రావాలంటారు ఆయన ఎడమ కాలు పెట్టి వస్తే పర్వాలేదా అని హాసిని అంటుంది. నువ్వు ముందు బయటికి నడు అని తిలోత్తమ అంటుంది. నా తాలుబొట్టును తే0చాలనుకున్నది ఎవరో తెలిసిందా అని హాసిని అంటుంది. తెలియదు అని తిలోత్తమ అంటుంది. నేనే అని హాసిని అంటుంది. నువ్వా వల్లభ ని షూట్ చేసింది అని తిలోత్తమ అంటుంది.ఉతికేటప్పుడు మీ అబ్బాయిని పాయంటూ ఎత్తలేను అలాంటిది గన్ను పట్టుకొని షూట్ చేయగలనా అని హాసిని అంటుంది. ఇందాక నువ్వే కదా అన్నావు అని వల్లభ అంటాడు. పనిచేసేటప్పుడు దేనికైనా తట్టుకో ని పుటుకుమంటుందేమో అని అలా అన్నాను అని హాసిని అంటుంది తాళిబొట్టు అంటే నీకు అంత చులకన అయిపోయిందా
అని తిలోత్తమ అంటుంది. మా ఆయన మొదటి తండ్రి కట్టిన తాళి ఎక్కడ ఉంది అని హాసిని అంటుంది. తెలియదు అని వల్లభ అంటాడు. ఎప్పుడో అమొకో తిన్నది బ్రో అని హాసిని అంటుంది. ఇదేదో చూసినట్టు చెప్తుంది అని తిలోత్తమ అంటుంది. జగదీష్ మామయ్య తాళి కట్టకపోయినా డైమండ్ రింగ్ కొనిచ్చాడు కదా అదెక్కడుంది అని హాసిని అంటుంది.అవును అదెక్కడుంది అని వల్లభ అంటాడు. తాకట్టులో పెట్టి తెచ్చుకొని తిన్నదయ్య మీ అమ్మ అని హాసిని అంటుంది. ఇవన్నీ నీకెలా తెలుసు అని తిలోత్తమ ఆశ్చర్య పోతుంది. హాసిని అంటే ఏమనుకున్నావ్? నీ డైరీ ఎక్కడపడితే అక్కడ పడేసుకోకు అని చేతులో పెట్టి వెళ్ళిపోతుంది హాసిని.మొత్తం చదివి ఉంటుందా అని టెన్షన్ పడుతుంది తిలోత్తమ. కట్ చేస్తే,అమ్మ ఇప్పుడేమో చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలతో ఆడుకుంటావ్. తిలోత్తమ అమ్మ కనపడితే తనను అంతం చేయాలని చూస్తావు అని విశాల్ గాయత్రితో మాట్లాడుతూ ఉంటాడు. తిలోత్తమ అమ్మ వాళ్లకి సహకరించే వాళ్ళని శత్రుశేషం లేకుండా చేద్దామనుకున్నాను కానీ వీళ్లు పడలేదు అని విశాల్ అంటాడు.
ఇంతలో నైని వచ్చి బాబు గారు గాయత్రి కి పాఠాలు చెబుతున్నారా అని నైని అంటుంది. అదేమీ లేదు అని విశాల్ అంటాడు. మీకు పాలు తీసుకు రమ్మంటారా అని నైని అంటుంది. ఆన్సర్ కావాలి వల్లభ అన్నయ్యని ఎవరో షూట్ చేస్తారని నీకు ముందే తెలుసా కాల్చింది ఎవరు చెప్పు అని విశాల్ అంటాడు. వాళ్లతో ముందే మాట్లాడను బాబు అని నైని అంటుంది. ఏం చెప్పానవు నైని అని విశాల్ అంటాడు. హాసిని అక్క అని నైని అంటుంది. హాసిని వదిన అన్నయ్యని షూట్ చేసిందా జోక్ చేస్తున్నావా అని విశాల్ అంటాడు. మీరు బయటికి వెళ్ళగానే హాసిని అక్కకు ఇంట్లో పనులు అప్పజెప్పి తను బిజీగా ఉంచి వల్లభ బావని గండం నుంచి తప్పిదం అనుకున్నాను కానీ ఎప్పుడు వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది అని నైని అంటుంది. హాసిని నీ పసుపు కుంకుమ నువ్వే తుడిచేసుకోవాలి అనుకున్నావా అని పావన మూర్తి అంటాడు.
దానిదేముంది బాబాయ్ మొహం మీద నీళ్లు చల్లుకుంటే పోతాయి అని హాసిని అంటుంది. వదిన ఇప్పటివరకు ఏమీ తెలియనట్టే ఉంది కదా అని విశాల్ అంటాడు. వీధిరాత కథ అలా ఉండడం తప్ప ఏమీ చేయలేదు అని నైని అంటుంది. నేను నమ్మలేకపోతున్నాను అని విశాల్ అంటాడు. తన భర్తని చంపబోతుందని అక్కకు చెప్పలేకపోయాను హాసిని అక్క అంటే నాకు చాలా ఇష్టం బాబు అందుకే చెప్పలేకపోయాను తన మంగళసూత్రాన్ని తనే తీసేసుకోవాలనుకుంది అని నైని బాధపడుతుంది. నా భర్త పోతే పోయాడు నా చెల్లి బాగుండాలి విశాల్ బాగుండాలి అని హాసిని బాధపడుతుంది.మికు ఒక దండం పెట్టాలి తల్లోయ్ ఏం చేస్తున్నారో ఏమో అని పావన మూర్తి అంటాడు. కట్ చేస్తే, అమ్మ వస్తుంది దండం పెట్టుకుంటే సరిపోదు పాదాలకి పుష్పములు సమర్పిస్తే మంచి జరుగుతుంది అని ఎద్దులయ్య అంటాడు.
ఏమంటున్నారమ్మా విల్లు అని వల్లభ అంటాడు. ఆ గారడి పిల్ల విశాలాక్షి వస్తుందంటారా తన పాదాలకి పూలు పెట్టి దండం పెట్టమంటున్నాడు అని తిలోత్తమ అంటుంది. తప్పేముంది ఎద్దులయ్య ఏదో విశేషం ఉంటేనే చెప్తాడు అని హాసిని అంటుంది. వయసు పెరగడం వల్ల బుద్ధి మందగిస్తుంది అందుకే అమ్మను మొక్కమన్నాను అని ఎద్దులయ్య అంటాడు. పూలు తెస్తాను అంటూ నైని వెళ్తుంది. నైని అమ్మకి భక్తి ఎక్కువ అని పావనమూర్తి అంటాడు.ఏ పుట్టలో ఏ పాము ఉందో అని లోలోపల ఉండే భయాన్ని భక్తి అనుకొని భ్రమ పడుతున్నారు అని సుమన అంటుంది. భ్రమ పడబోయేది నువ్వు సుమన అని విశాలాక్షి అంటుంది. నువ్వు వస్తున్నావని ఎద్దులయ్య చెప్పగానే చాలా సంతోషం అనిపించింది రా అమ్మ అని విశాల్ అంటాడు. విశాలాక్షి లోపలికి వచ్చి నిలబడుతుంది. అరే పాదాలకు పెట్టుకున్న పసుపు ఇంకా ఆడలేదు అనుకుంటా అచ్చులు పడుతున్నాయి విశాలాక్షి అని విక్రాంత్ అంటాడు. ఈరోజు అంతా అలాగే ముద్రలు పడుతూ ఉంటాయి భక్తులు పసుపు గౌరీ పూజ చేసినందుకు అని విశాలాక్షి అంటుంది. నీకు చేశారా సోదరి అని పావనమూర్తి అంటాడు.
ఇంకా నయం తనను కూర్చోబెట్టి పూజలు చేశారని చెప్పలేదు అని వల్లభ అంటాడు. ఇంతలో నైని పువ్వులు తీసుకువస్తుంది. పసుపు గౌరీ పూజ చేసుకుని వచ్చిన అమ్మ పాదాలకి పూలు సమర్పించి ఏదైనా కోరుకోండి కోరిక వెంటనే నెరవేరుతుంది అని ఎద్దులయ్య అంటాడు. కోరిక తీర్చేస్తుందా గారడి పాప అని తిలోత్తమ అంటుంది. పొద్దున్నే లేచి ఎక్ససైజ్ చేసే వాళ్ళని దండం పెట్టొద్దని చెప్పొచ్చుగా అని వల్లభ అంటాడు. అన్నయ్య పొద్దున్నే పెట్టుకున్న పసుపు ఇంకా ఆరలేదు అంటే ఏంటి దాని అర్థం అని విశాల్ అంటాడు.ఇంకా ఆరలేదు కాబట్టి ఇంక అలాగే ఉండొచ్చు అని వల్లభ అంటాడు. నీ మొహాలకు రాసుకున్న పేస్టు గాలికి ఆరిపోతుంది కానీ విశాలాక్షి పాదాలకు రుద్దుకున్న పసుపు రోజంతా అలాగే ఉంటుంది అని హాసిని అంటుంది. ఇంకెందుకు లేటు కాళ్ల మీద పడండి అని సుమన అంటుంది. నిత్యం పూజల్లో పాల్గొనే విశాలాక్షికి పూజ చేస్తే తప్పులేదు అని నైని అంటుంది. పూజ అంటే పెద్దగా చేయనక్కర్లేదు పువ్వులు పెట్టి దండం పెట్టుకుంటే చాలు అని విక్రాంత్ అంటాడు. చిన్నపిల్ల పాదాలు నేను ముట్టుకోను ఆయుష్ తగ్గిపోతుంది అని సుమన అంటుంది. తనకి ఆయుష్ ఎక్కడ ఉంది చిట్టి మాత అని ఎద్దులయ్య అంటాడు. త్వరలోనే కైలాసానికి పోతుందా అని వల్లభ అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ అన్నయ్య అని విశాల్ అంటాడు. తన అమ్మ చచ్చిపోతుందేమో అని తిలోత్తమ అంటుంది. అదే లేని అమ్మకి ఆయుష్ ఏంటమ్మా అని ఎద్దులయ్య అంటాడు. అర్థమైంది ఇక విశాలాక్షికి పూజ చేస్తే మనం ఆ భగవంతునికి చేసినట్టే అని పావని మూర్తి పూలదండని తీసుకొని విశాలాక్షి పాదాల మీద పెట్టి శాష్టంగా నమస్కారం చేస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది