Trinayani January 20 2024 Episode 1142:అంతేగాని మీరు మాత్రం విడుమర్చి చెప్పన0టారు అంతేనా బాబు గారు అని నైని అంటుంది. నేను అలా ఎందుకు చెప్పాను లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది అని విశాల్ అంటాడు. మనం ప్రాణాలకు తెగించి పిల్లలకంటే వీళ్ళు నిజాలు చెప్పడానికి భయపడుతున్నారు చూసావా అక్క అని సుమన అంటుంది. నువ్వు నన్ను ఎందుకు చంపాలి అనుకున్నావో చెప్తే బ్రో తర్వాత చెప్తాడు అని విక్రాంత్ అంటాడు. నన్ను ఇంట్లో నుంచి గేంట్యాలని చూస్తే పొద్దున నా సేవని బయట పెడతారు చెప్తున్నా అని సుమన అంటుంది. చెల్లి ఎందుకు అలా అంటావు అని నైని అంటుంది.బెదిరించడం లేదక్కా పొద్దున మనిషిగా నైట్ పాము పిల్లగా మారే ఉలొచ్చిని మీ మరిది చూసుకోలేరు అని సుమన ఉలొచ్చిని తీసుకుని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే అల్లుడు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు గార్డెన్లోకి వెళ్దాం రండి అని పావన మూర్తి అంటాడు. రేపు గాయత్రి వదిన వస్తుంది కదా మీకు తెలియదా అని దురంధర అంటుంది.ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటారు కానీ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు అని తిలోత్తమ అంటుంది. అడిగితే మాత్రం చెప్తాడు అనుకుంటున్నావా అని హాసిని అంటుంది. పెద్ద వదిన ఎలా ఉందో అని ఎంత ఆత్రుతగా ఉందనుకుంటున్నావు అందరికీ అని దురంధర అంటుంది. చెల్లికే చెప్పినవాడు మనం అడిగితే చెప్తాడా అని హాసిని అంటుంది. నాకు కావాలి అని తిలోత్తమ అంటుంది. ఇదంతా వృధా ప్రయాసరా పిన్ని అని హాసిని వెళ్ళిపోతుంది. మమ్మీ విశాల్ నిజం చెప్తాడు అంటావా అని వల్లభ అంటాడు. ఎందుకు చెప్పడ్రా ప్రయత్నించి చూద్దాం అని తిలోత్తమ అంటుంది.
కట్ చేస్తే, అందరిని పిలువు నిజం తెలుసుకుందాం అని వల్లభ అంటాడు. ఏంటి పెద్దల్లుడు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నావు అని దురదర అంటుంది. అదే నా కన్న కూతురు గాయత్రి గురించి తెలిసింది అన్నాడు కదా దాని గురించి తెలుసుకోవాలి అని నైని అంటుంది. నిన్ననే చెప్పాడు కదా అమ్మ మళ్లీ ఏముంది తెలుసుకోవడానికి అని విశాలాక్షి అంటుంది. నిన్న విశాలాక్షి పాయసం పెట్టి మంచి ఉపకారమే చేసింది కానీ ఈ రోజు ఎలాగైనా సరే గాయత్రి పెద్దమ్మ ఎక్కడ ఉందొ చెప్పాల్సిందే అని వల్లభ అంటాడు. ఏంటి అల్లుడు చెప్పేది నిన్న చెప్పాక మళ్ళీ ఎలా చెబుతాడు అని పావన మూర్తి అంటాడు. నిన్న పాయసం తిన్నాక ఒక్కటే క్వశ్చన్ అడగాలి ఇంకొకటి అడగకూడదని కండిషన్లు పెట్టారు ఈరోజు అలా లేదు కదా చెప్పి తీరాల్సిందే అని వల్లభ అంటాడు. ఇంతలో విశాల్ విక్రాంత్ కిందికి వస్తారు.కట్ చేస్తే, ఏంటి అందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అని విశాల్ అడుగుతాడు. ఏముంది నిన్న నువ్వు కన్నతల్లి గురించి తెలుసని చెప్పావు కానీ ఎక్కడ ఉందో చెప్పలేదు అది ఈరోజు చెప్పాలి అని తిలోత్తమ అంటుంది.
నిన్ననే చెప్పాను కదా మళ్లీ ఈ రోజేంటి కొత్తగా అని విశాల్ అంటాడు. చెప్పావు తమ్మి కానీ అది అబద్ధం అని తేలిపోయింది కదా ఇప్పుడు ఎక్కడ చూసావో ఎక్కడ ఉందో చెప్పాలి అని వల్లభ అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి అని విశాల్ ఆలోచిస్తూ ఉంటాడు. తప్పించుకోలే వు విశాల్ చెప్పాల్సిందే అని తిలోత్తమ అంటుంది. ఇలా అయితే చెప్పుడు మమ్మీ అని వల్లభ గాయత్రి దేవి ఫోటో తెచ్చి మీ అమ్మ మీద ఒట్టేసి పెద్దమ్మ ఎక్కడ ఉందో చెప్పు అని వల్లభ అంటాడు. చెప్పు నాన్న ఇంకా ఎందుకు నిజందస్తావ్ అని విశాలాక్షి అంటుంది. నైని తన చేయి తీసుకుని నెత్తి మీద పెట్టుకొని బాబు గారు మీరు ఒట్టు వేయాల్సింది గాయత్రి అమ్మ గారి మీద కాదు నా మీద ఒట్టేసి నేను కన్న బిడ్డ ఎక్కడ ఉందో నిజం చెప్పండి అని నైని అంటుంది. అదేంటి నైని అలా అంటావ్ అని విశాల్ అంటాడు. విశాల్ నువ్వు ఆలస్యం చేసే కొద్ది నువ్వు ప్రేమించే వారి ఆయుష్ మీద దెబ్బ పడుతుందని తెలుసుకో అని తిలోత్తమ అంటుంది. బావగారు అంతగా ఆలోచిస్తున్నారు అంటే చెప్పడం ఇష్టం లేదేమో నీ ప్రాణం పోయినా బావకి పర్వాలేదు ఏమో అక్క అని సుమన అంటుంది. విశాల్ ఏదైతే అదే అవుతుంది నిజం చెప్పేసే అని హాసిని అంటుంది
చెప్పండి బాబు గారు ఈరోజు మీరు నిజం చెప్పకపోతే నేను చచ్చిపోయినంత ఒట్టే అని నైని అంటుంది. ఇక చేసేది ఏమీ లేక విశాల్ తన చేయి తీసి నన్ను కన్న తల్లిని నేను చూశాను ఎక్కడో లేదు ఇక్కడే ఉంది అని అంటాడు. ఏంటి విశాల్ నువ్వు చెప్పేది నిజమా ఎక్కడ అని తిలోత్తమ అంటుంది. ఏంటి తమ్ముడు మన ఇంట్లో ఉందా ఎవరు గాయత్రి పాపా అని వల్లభ అంటాడు. ఎక్కడ ఉంది బాబు గారు మన ఇంట్లో ఎవరు అని నైని ఆరాటంతో అడుగుతుంది. విశాల్ విశాలాక్షి వంక చూపెట్టి ఆవిడే నేను కన్నా కూతురు అని చెబుతాడు. ఏంటి విశాల్ ఎందుకు అబద్ధం చెబుతున్నావ్ ఇదొక కొత్త నాటకమా అని తిలోత్తమ అంటుంది. విష్ నువ్వు చెప్పేది నిజమా విశాలాక్షి నువ్వు కన్నా కూతురా అని దురంధర అంటుంది. బావ గారికి ఇష్టం లేక అలా చెప్తున్నారు మా అక్కకి పెళ్లి అయ్యి నాలుగు సంవత్సరాలు అవుతుంది పదేళ్ల కూతురు ఎలా ఉంటుంది అని సుమన అంటుంది. నిజం చెప్పండి బాబు గారు విశాలాక్షి మీరు కన్న కూతురా అని నైని అడుగుతుంది. విశాల్ ఒక్కసారి నైట్ విశాలాక్షి హాసిని మాట్లాడుకున్నదంతా గుర్తుకు తెచ్చుకుంటాడు.
కట్ చేస్తే, ఇప్పుడు ఏం చేద్దాం వదినా చెబితే ఆ దుర్మార్గులు ఏం చేస్తారో చెప్పకపోతే నైని కి అబద్దం చెప్పానని నాకు గిల్టిగా ఉంటుంది అని విశాల్ అంటాడు. ఏముంది నాన్న గాయత్రి నీ కూతురని నిజం చెప్పేయండి అని విశాలాక్షి అంటుంది. నీకు కూడా తెలిసిపోయిందా తిలత్తమ వాళ్లకు మాత్రం చెప్పకు అని హాసిని అంటుంది. మీరు నన్ను గుడిలో చూశారు కదా అదే చెప్పండి నేనే గాయత్రి అని చెప్పండి నాన్న అని విశాలాక్షి అంటుంది. అదెలా పాప అని హాసిని అంటుంది. జీవం గుడిలో గాయత్రీ దేవిని చూపెడితే నేను గారడీ చేసి గాయత్రి గా మారిపోయి తన ముందు కనిపించాను అందుకే జీవం నిజం చెప్పినా చనిపోలేదు కాబట్టి నేనే గాయత్రి అని చెప్పండి నాన్న ఏం కాదు అని విశాలాక్షి అంటుంది. నాకు అర్థమైంది అని విశాల్ విశాలాక్షి తన కూతురని చెప్పడానికి డిసైడ్ అయిపోతాడు. అదంతా ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకుంటాడు విశాల్. కట్ చేస్తే, ఏంటి విశాల్ నువ్వు చెప్పింది నేను నిజమని ఎలా నమ్మాలి మేము అడిగింది గాయత్రి అక్కని మిమ్మల్ని అమ్మానాన్న అంటుందని తనే నీ కూతురు అంటే నేను ఎలా నమ్మేది అని తిలోత్తమ అంటుంది
ఏంటి బావగారు మా అక్క పెళ్లి అయ్యి పదేళ్లు కావట్లేదు నాలుగు సంవత్సరాలవుతుంది ఈ లోగా పదేళ్ల పిల్ల ఎలా ఉంటుంది అని సుమన అంటుంది. అందరూ కలిసి బ్రో ని ఇబ్బంది పెడుతున్నారు నాకు జాలేస్తుంది గాని విక్రాంత్ అంటాడు. మా అక్కను చూస్తే నాకు జాలి వేయడం లేదా తన కన్న కూతురు ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటే మా బావ అబద్ధం చెప్తున్నాడు తనను చూస్తుంటే నాకు జాలి వేస్తుంది అని సుమన అంటుంది. చెప్పండి బాబు గారు నా మీద ఒట్టేశారు గాయత్రి అమ్మ గారి విషయంలో అబద్ధం చెప్పరని అనుకుంటున్నాను అని నైని అడుగుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది