Trinayani: ఉలోచిని తీసుకొని వెళ్ళిపోతే నేనెవరి కోసం వచ్చినట్టు అని పెద్ద బొట్టమ్మ అంటుంది. సుమన గాయత్రి పాప ని ఎత్తుకెళ్తుంది అని డమ్మక్క అంటుంది. ఏ సుమన ఆగు అని పెద్ద బోట్టమ్మ అంటుంది. కట్ చేస్తే, సుమనకు మాత్రం పిల్లలని పట్టించుకోవడమే లేదు అని పావనుమూర్తి అంటాడు. సుమన ఇంట్లో లేదు ఉలోచి ని ఎత్తుకొని వెళ్ళింది బయటికి అని పావన మూర్తి అంటాడు.పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు సుమన బయటకి ఎందుకు వెళ్ళింది అని నైని అంటుంది. గాయత్రీ ని ఎత్తుకొని వెళ్ళింది అని డమ్మక్క అంటుంది. పాపని ఒక్కదాని వదిలేసి ఎటు వెళ్తున్నావ్ అని విక్రాంత్ అంటాడు. పెద్ద బొట్టమ్మ గంపలు ఏమో తెచ్చింది అని తిలోత్తమ అంటుంది. గౌరీ వ్రతం చేసుకొని ముత్తైదువులకి వాయనం ఇస్తూ వెళ్తూ ఉండగా నన్ను సుమనే పిలిచింది అని పెద్ద బోట్టమ్మ అంటుంది.
పెద్దమ్మ నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావు అంతే చాలు అని నైని అంటుంది. ఇలాంటి గౌరీ వ్రతం నేనెప్పుడూ వినలేదు అని వల్లభ అంటాడు . ఆకుతో కూరతో కాయతో పూలతో పండ్లతో సృష్టిలో ఉన్న దానితోని దేనితోనైనా ఆ తల్లి నోము నోచుకోవచ్చు అని పెద్ద బొట్టమ్మ అంటుంది. నోము పూర్తయిందా అని విశాల్ అంటాడు. అయిపోయింది బాబు ఇక్కడ ఉన్న నలుగురికి వాయనం ఇచ్చి వెళ్తాను తిలోత్తమ ముందు మీరే వాయనం అందుకోవాలి అని తిలోత్తమ నీ పిలుస్తుంది పెద్ద బొట్టమ్మ. ఎందుకైనా మంచిది నలుగురికి ఒకేసారి వాయనం ఇవ్వు అని సుమన అంటుంది. అంత అనుమానం ఉన్న దానివి ఆవిడను లోపలికి ఎందుకు రమ్మని పిలిచావు అని విక్రాంత్ అంటాడు. ఒప్పందం అలాంటిది అని డమ్మక్క అంటుంది. ఒప్పందం చేసుకునే అంత వాళ్ళిద్దరి మధ్య ఏముంది అని విశాల్ అంటాడు. నువ్వు గాయత్రి ని ఎత్తుకుపోతే నేను ఉలోచిని ఎత్తుకుపోతా అని పెద్ద బొట్టమ్మ అనడంతో సుమన లోపలికి వస్తుంది అది గుర్తుకు తెచ్చుకుంటుంది సుమన.
పెద్ద బొట్టమ్మ నలుగురికి వాయినాలు ఇస్తుంది. ఏదో ఉన్నంతలో వాయనం ఇస్తున్నాను మీరందరూ ఆశీర్వదించండి అని పెద్ద బొటమ్మ అంటుంది. నలుగురు దీవిస్తారు పెద్ద బొట్టమని. విక్రాంత్ బాబు ఉలిచిని ఇక్కడ పడుకోబెట్టు అని పెద్ద బొట్టమ్మ అంటుంది.ఎందుకు ఎత్తుకు పోతావా అని సుమన అంటుంది. దిష్టి తీస్తాను అని పెద్ద బొట్టమ అనడంతో ఉలోచిని గాయత్రి ని అక్కడ కూర్చోబెడతారు. దిష్టి తీసినట్టు దిష్టి తీసి ఉలోచి ని మాయం చేస్తే సుమన ఏం చేస్తుంది అని పెద్ద బోట్టమ్మ అనుకుంటుంది. పెద్ద బొట్టమ్మ పిల్లలిద్దరికీ దిష్టి తీస్తుంది.ఉలోచి మాయమవుతుందనుకుంటే గాయత్రి పాప మాయమైపోతుంది. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. పాప ఏది అని కంగారుపడుతూ విశాల్ అడుగుతాడు. పెద్ద బొట్టమ్మ నా బిడ్డను ఏం చేశావు అని అంటుంది నైని. గాయత్రిని మాయం చేసావా అని తిలోత్తమ అంటుంది.
నేను గాయత్రిని మాయం చేయాలనుకోలేదు అని పెద్ద బొట్టమ్మ అంటుంది. నా కూతురు ని మాయం చేయాలనుకున్నావా అని సుమన ఉలోచిని ఎత్తుకుంటుంది. అందరూ గాయత్రి పాప కోసం వెతుకుతూ ఉంటారు. కట్ చేస్తే, గాయత్రి పాప గాయత్రి దేవి గా నామకరణం చేసుకొని మూడు రోజులు కూడా ఉండకుండానే పాయే కోట్ల ఆస్తి ఉన్న లాభమేంటి అని వల్లభ అంటాడు.అమ్మవారి పేర్లు ఎన్ని ఉన్నా సరే గాయత్రీ పేరు పెట్టుకోవడానికి ఒకటికి పది సార్లు ఆలోచించాలి అని తిలోత్తమ అంటుంది. పునర్జన్మెత్తిన కంటికి కనిపించడం లేదు చూద్దామన్న అని వల్లభ అంటాడు. పోనీ లేరా పేరు పెట్టగానే గాయత్రి అక్క శక్తి అంతా ఈ పిల్లకు వచ్చేస్తుందేమో అని భయపడ్డాను మాయమైపోయింది అని అంటుంది తిలోత్తమ. గాయత్రి పాపని ఎవరు మయం చేసి ఉంటారు మమ్మీ అని వల్లభ అంటాడు. ఇంకా ఎవర్రా? ఆ పెద్ద బొ ట్టమే అయి ఉంటుంది అని తిలోత్తమ అంటుంది. రేయ్ వల్లభ పాపం గాయత్రి పాప మాయమైపోయింది రా ఓట్ల ఆస్తి వచ్చినందుకు తనమీద దిష్టి తగిలి మాయమైపోయిందో విషపురుగు అయినా పెద్ద బొట్టమని రానిచ్చినందుకు పెద్ద బొటమే మాయం చేసిందో కానీ పాప మాయమైపోయింది రా అని తిలోత్తమ అంటుంది.
పోనీలే మమ్మీ మనకు అస్తంతా వస్తుంది అని వల్లభ అంటాడు. గాయత్రి అక్క ఆస్తులు అంత దక్కించుకోవాలి పాప మాయమైపోయిన కారణం బయటపెట్టి మనం తప్పించుకోవాలి అని తిలోత్తమ అంటుంది. కట్ చేస్తే, విశాల్ గాయత్రి పాప కనిపించడం లేదు నీకెందుకు టెన్షన్ లేదు అని హాసిని అంటుంది. నా కూతురు అనుకుంటే కంగారు మొదలయ్యేది కానీ మా అమ్మ కదా మా అమ్మ ఎక్కడ ఉన్న క్షేమంగా ఉంటుంది తిరిగి నా దగ్గరికి వస్తుందని నాకు నమ్మకం ఉంది అందుకే నిబ్బరంగా ఉన్నాను అని విశాల్ అంటాడు. ఏంటి అక్క అంత చిన్నగా మాట్లాడుకుంటున్నారు నాకు వినపడకూడదా అని నైని అంటుంది.
మీ ఆయన కూల్ గా ఉన్నాక నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావ్ అని హాసిని అంటుంది. గానవి పాప కనపడకుండా పోతే కంటికి నిద్ర లేకుండా వెతికేవారేమో దత్తత తీసుకున్న పాప కదా పోనీలే అని ఊరుకుంటున్నాడు అని అంటుంది నైని. నైని నన్ను అపార్థం చేసుకోకు నాకు అలాంటి తేడా లేదు అని విశాల్ అంటాడు.నా బాధ నీకు అర్థం అవుతుందా అక్క రెండేళ్లు కూడా లేవు పాపకి రెండు మాటలు కూడా రావు ఎవరైనా అడిగితే తను ఏం చెబుతుంది అని నైని అంటుంది.తను అడ్రస్ చెప్పడానికి తిరణాల్లో తప్పిపోలేదు నైని ఇంట్లో తప్పిపోయింది ఇక్కడే ఎక్కడ ఉంటుంది అని విశాల్ అంటాడు. అందుకని వెతికించకుండా ఊరుకుంటారా అని నైని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!