Trinayani October 30 Episode 1071: అవును చిట్టి ఈ గొడవల్లో పడి చూడడమే మర్చిపోయాం కానీ గ్లామర్ వచ్చేసింది నీ మొహానికి అని హాసిని అంటుంది. అవునా అని సుమన తన మొహమంతా చూసుకుని థాంక్స్ బావగారు అని అంటుంది. ఆ మాటకి వల్లభ బిత్తరపోయి చూస్తూ ఉంటాడు. వాళ్లే తిడతారు వాళ్లే పొగుడుతారు అని బావగారు షాక్ అవుతున్నారు సుమన అని నైని అంటుంది. మీ మూ ఊలోచిని చూసుకుంటాము కాని నువ్వు వెళ్లి మొహానికి బొట్టు పెట్టుకుని రా అని దురంధర ఉలోచిని ఎత్తుకోపోయేసరికి మెడలో దిష్టి పూస తెగి కిందపడి కనిపిస్తుంది. ఇదేంటి ఉలొచ్చి మెడలో దిష్టి పూస తెగిపోయి పడి ఉంది అని దురంధర అంటుంది. సుమనకు తగిలా దిష్టి కూతురు వల్ల పోయింది అందుకే పూసల దండ తెగిపోయింది ఈ తడవ గొడవ కన్నా మంచే జరిగింది అని నైని అంటుంది. ఆ మాటలు వినగానే అందరూ వల్లభ దగ్గరికి వెళ్లి మంచి పని చేశావు చాలా థాంక్స్ అని తనని అందరూ మెచ్చుకుంటారు.
కట్ చేస్తే సుమనా మేకప్ వేసుకుంటూ ఉంటుంది.నీ మొహానికి మేకప్ వేసుకోకుండా ఒక్కరోజు కూడా ఉండలేవా అని విక్రాంత్ అంటాడు. ఆ గారడి పిల్ల గంధపు నీళ్లు నా మొహం మీద చల్లింది అందుకే గంధం పోయేలా తుడుచుకొని మేకప్ వేసుకుంటున్నాను అని సుమన అంటుంది. ఆ గంధం నీ మొహం మీద పోయడం వల్లనే మరుగునపడన ని అందం బయటపడింది అని విక్రాంత్ అంటాడు. చూశారా నేను అందంగా ఉన్నానని మీరు కూడా ఒప్పుకున్నారు అని సుమనా అంటుంది. నేను నిన్ను ఒకటి అడుగుతాను సమాధానం చెప్పు భార్యని అందంగా ఉన్నావని భర్త ఎప్పుడు పొగుడుతాడు అని విక్రాంత్ అంటాడు. బ్యూటీ పార్లర్ కి వెళ్ళి అందంగా తయారై వచ్చినప్పుడు అని సుమన సమాధానం చెబుతుంది. కాదు భర్తకి తోడు నీడగా ఉండి తన కష్టంలో పాలుపంచుకొని అండగా ఉన్నప్పుడు భార్యని మెచ్చుకొని అందంగా ఉన్నావోయ్ అని అంటాడు విక్రాంత్. ఇలాంటి మాటలు మగాడు ఎప్పుడు చెప్తాడు చెప్పండి అని సుమన విక్రాంత్ ని అడుగుతుంది.
నీలాంటి భార్యతో నరకం అనుభవిస్తున్నప్పుడ అని విక్రాంత్ వెటకారంగా అంటాడు. కాదు భార్యని ఆనందంగా ఉంచలేనప్పుడు ఇలాంటి చెత్త కబుర్లు చెప్తాడు అని సుమన వెటకారంగా అంటుంది. నీకు సుఖపడే యోగం లేదే ఆ డబ్బుతోనే ఆనందంగా ఉండు అని విక్రాంత్ కోపంగా వెళ్ళిపోతాడు. ఏంటో ని మాటలు ఏమీ అర్థం కావు అని సుమన అనుకుంటుంది.కట్ చేస్తే డమ్మక్క పసుపు నీళ్లు తీసుకొని ఇల్లంతా చల్లుతూ ఉంటుంది. ఇంతలో నైని వాళ్ళ అమ్మ వచ్చి నిన్ను అటువైపు వెళ్ళనివ్వను ఆ విశాలాక్షి పేరు పెట్టుకున్నాందుకు ఆ పిల్ల ఏం చేస్తుంది ఏం మాట్లాడుతుంది అని అంటుంది. ఆ ప్రశ్న లేవొ నన్నే అడగొచ్చు కదా సమాధానం చెప్తాను డమ్మక్కని అడిగితే ఏం చెబుతుంది అని విశాలాక్షి అంటుంది. ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు ఏం జరుగుతుంది అని హాసిని అంటుంది.
ఏమీ లేదమ్మా అసలు ఈ పిల్ల ఎవరు ఇంత గారడి చేస్తుంది అని నైని వాళ్ళ అమ్మ అంటుంది. ఇప్పుడే ఏం చూసావా అమ్మ ఇంతకుముందు చాలా చేసింది ఇంకా చేస్తూనే ఉంటుంది అని పావన మూర్తి అంటాడు. ఈ పిల్ల గారడి మాటల వల్ల ఇంట్లో అందరికీ కష్టాలే వచ్చేలా ఉన్నాయి అని నైని వాళ్ళ అమ్మ అంటుంది. నావల్ల ఒకరికి కష్టం కలగదు కానీ నీవల్ల నష్టం జరుగుతుంది అని విశాలాక్షి అంటుంది. పిన్ని వల్ల నష్టం జరుగుతుందా ఎవరికి ఏం జరుగుతుంది అని హాసిని కంగారు పడుతూ అంటుంది. చూడక్కా నీ కూతుళ్ళని చూసి వెళదామని వచ్చావు ఎవరికీ నష్టం జరగకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అని దురంధర అంటుంది. నువ్వుండవే నైని పెట్టింది తిని బ్రతికిక్కుతున్నాము మనము ఇంకొకరిని వెళ్ళమనే హక్కు మనకు లేదు అని పావన మూర్తి అంటాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నా ఎవరికి నష్టం జరగదులే పిన్ని కష్టం రాకుండా విశాలాక్షి చూసుకుంటుంది అని హాసిని అంటుంది. నేను మాత్రం ఏం చేస్తానమ్మా అని విశాలాక్షి అంటుంది. ఆ మాటలకి నైని వాళ్ళ అమ్మ కంగారు పడుతూ ఉంటుంది.
ఏంటమ్మా భయపడుతున్నావా ఈ మాటలకి అని పావన మూర్తి అంటాడు. లేదు సోదరా చీకటిని చూస్తే భయపడుతుంది అని విశాలాక్షి అంటుంది. ఎందుకమ్మా చీకటి అంటే నీకు భయమా అని పావన మూర్తి అంటాడు. కాదు సోదరా కాలికాన్ని చూస్తే భయం వేస్తుంది అని విశాలాక్షి అంటుంది. అవునా పిన్ని చీకటి అయ్యాక నన్ను కూడా లేపు నేను కూడా చూస్తాను అని హాసిని అంటుంది. ఇంకా సేపట్లో చీకటి అవబోతుంది అమ్మ ఏం చేస్తుందో ఏమో పద మనం వెళ్ళిపోదాము అని పావనమూర్తి దురదర ను తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఈ పిల్ల ఈరోజు ఏదో చేయబోతుంది అదేంటో తెలుసుకోవాలి అని నైని వాళ్ళ అమ్మ తన మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే విశాలాక్షి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి హాసిని వచ్చి ఏంటి విశాలాక్షి ధ్యానం చేస్తున్నావా నేను కూడా చేద్దాం అనుకుంటాను కానీ ఇంట్లో జరిగే గొడవలోకి రగడలకే టైం సరిపోతుంది ఇంక ధ్యానం చేసే టైం ఎక్కడ ఉంటుంది మా ఆయన కూడా చేస్తాడు శవాసనం అని హాసిని నవ్వుతుంది.
ఇంతలో నైని వచ్చి ఏంటి అక్క విశాలాక్షి ధ్యానం చేస్తూ ఉంటే ఏవో చెబుతున్నావు అని అంటుంది. ఒకరు వింటారని చెప్తానా ఏంటి నాకు చెప్పాలనిపించింది చెప్తాను వాళ్ళు వింటే వింటారు లేకుంటే లేదు అని హాసిని. అంటుంది. నేను కాదని అంటే మాత్రం నువ్వు వింటావా అమ్మ అని విశాలాక్షి అంటుంది. సరేలే విశాలాక్షి పొద్దుపోయింది ఇక పడుకో అని నైని విశాలాక్షికి బెడ్ షీట్ కప్పి లైట్లు బంద్ చేసి వెళ్ళిపోతుంది. ఈ పిల్ల ఏం చేస్తుందో చూద్దాము తను ఉంటే నా పని సఫలం అవ్వదు ఎలాగ అయిన తనని బెదిరించి పంపించేయాలి అని నైని వాళ్ళ అమ్మ వచ్చి ఏ అమ్మాయి పిలిచేది నిన్నే వినపడట్లేదా లే అని బెడ్ షీట్ లాగుతుంది. బెడ్ షీట్ లాగా గానే విశాలాక్షి కాళ్లు మాత్రమే కనిపించి ఆ కాలనీ నుంచి మంటలు వస్తాయి అమ్మవారు దర్శనమిస్తుంది అమ్మవారిని చూసి అమ్మ నన్ను క్షమించమ్మా అని భయపడుతూ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది నైని వాళ్ళ అమ్మ. ఆరుపులకి అందరూ పరిగెత్తుకొస్తారు.అమ్మ నీకేమైంది లే అమ్మ అని నైని అంటుంది. శ్యామలమ్మ నీకేమైంది అమ్మ ఏంటి ఇలా కళ్ళు తిరిగి పడిపోయావు అని పావన మూర్తి అంటాడు. శ్యామల లే శ్యామల అని తిలోత్తమ అంటుంది.
నైనీ నీళ్లు తెచ్చి మొహం మీద చల్లండి లేస్తుంది అని దూరందర అంటుంది. నైని ఇవాళ మా మొహం మీద నీళ్లు కొట్టి అమ్మ లేయమ్మా నీకు ఏమైంది అని కంగారుపడుతూ వాళ్ళ అమ్మని లేపుతుంది. అత్తయ్యకు ఇప్పుడే మెలకువ వస్తుంది ఆగండి అని విశాల్ అంటాడు. మెల్లగా కళ్ళు తెరిచే శ్యామల కంగారుపడుతూ అందరిని చూసి భయపడుతుంది. ఇక్కడ పడుకుంది విశాలాక్షిన అని సుమన అడుగుతుంది. అవును అని హాసిని సమాధానం చెబుతుంది. అయితే ఇంకేముంది ఇక్కడ విశాలాక్షి పడుకున్నది గమనించని అమ్మ తనని చూసి భయపడి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది అని సుమన అంటుంది. అడ్డంగా పడుకుంది అని తొక్కి వెళ్లే పోక ఎందుకత్తయ్య తనను చూసి భయపడి కింద పడిపోయావు అని వల్లభ అంటాడు. కళ్ళు పోతాయి అలాంటి మాటలు మాట్లాడకు తనని తొక్కుకుంటూ పోతే అంగవైకల్యం వచ్చేస్తుంది అని గట్టిగా అరుస్తూ అంటుంది శ్యామల. తను అంత గట్టిగా అరచి మాట్లాడేసరికి అందరూ షాక్ అవుతారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!