Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ షో రన్ అవుతున్నప్పుడు కంటే ఇప్పుడు వార్తలు ప్రముఖంగా నిలుస్తుంది. స్థానిక ప్రధాన కారణం ఈ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్. కామన్ మ్యాన్ గా రైతుబిడ్డగా హౌస్ లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. అద్భుతమైన గేమ్ ఆడి గెలవడం జరిగింది. ముఖ్యంగా శివాజీ వాళ్ళనే తాను టైటిల్ గెలిచినట్లు అన్న తనకి బాగా సపోర్ట్ చేసినట్లు ప్రశాంత్ టైటిల్ గెలిచాక తెలియజేశారు. ఈ క్రమంలో టైటిల్ గెలిచాక అన్నపూర్ణ స్టూడెంట్ నుండి బయటకు వచ్చాక పోలీసుల రూల్స్ ప్రకారం సైలెంట్ గా వెళ్ళిపోకుండా ప్రశాంత ర్యాలీ నిర్వహించాడు. ఆ సమయంలో కొన్ని ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీస్ కార్లు కూడా డ్యామేజ్ కావడం జరిగింది. దీంతో ప్రశాంత్ పై కేసు నమోదు కావడంతో.. జూబ్లీహిల్స్ పోలీసులు నిన్న అతన్ని అరెస్టు చేయడం జరిగింది.
అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో.. ఉన్నాడు. ప్రశాంత్ నీ బయటకు తీసుకురావడానికి అనేక మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సీజన్ సెవెన్ లో టాప్ ఫోర్ లో యావర్ నిలవడం తెలిసిందే. ఈ క్రమంలో 15 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకొని షో నుండి బయటకు రావడం జరిగింది. తెలుగు భాష సరిగ్గా రాకపోయినా మాస్క్ లేని గేమ్ ఆడి అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే హౌస్ లో ఎక్కువగా శివాజీ మరియు పల్లవి ప్రశాంత్ తో యావర్ క్లోజ్ గా ఉన్నాడు.
ఈ క్రమంలో షో స్టార్ట్ అవ్వకముందే పల్లవి ప్రశాంత్ తో పరిచయం ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఇద్దరు కలిసి గేమ్ ఆడారని చూసే ప్రేక్షకులను పిచ్చోళ్ళను చేశారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై యావర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. కేవలం తన గేమ్ షో లోకి వెళ్లక ముందు రోజే అతనితో పరిచయం. అది కూడా హాయ్ బాయ్ అన్న విధంగా మాట్లాడుకున్నాం. ఇద్దరం కలిసి గేమ్ ఆడటం అన్నది అవాస్తవం.. అని యావర్ స్పష్టం చేశారు.