ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ “పారదర్శక పన్ను నిజాయితీని గౌరవించడం” అనే ప్లాట్ ఫాం నీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. భారతదేశ ఆదాయ పన్ను వ్యవస్థను సంస్కరించే… సరళీకరించే విధానాలను బలోపేతం చేయడంలో తాజాగా అందుబాటులోకి తెచ్చిన ప్లాట్ ఫామ్ ఉపయోగపడుతుందని అప్పట్లో మోడీ స్పష్టం చేశారు. కరోనా లాక్డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడంతో పునర్నిర్మించే చర్యల్లో భాగంగా నిజాయితీగా పన్ను చెల్లిస్తున్న వారికి అందుకు తగిన ప్రోత్సాహం అందించేందుకు…. మోడీ నే అనేక నిర్ణయాలు పన్ను చెల్లింపుదారులు విషయంలో తీసుకోవడం జరిగింది.
పారదర్శకతే గౌరవం..!
సెప్టెంబర్ 25 వ తారీకు నుంచి అమల్లోకి రానున్న ఈ పన్ను విధానం వల్ల పన్ను చెల్లింపుదారులకు దిమ్మతిరిగే షాక్ లు ఇవ్వటం గ్యారెంటీ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇన్కమ్ టాక్స్ ఆదాయపు చట్టం సెక్షన్ 69 ప్రకారం…. మీ ఖాతాలో ఉన్న డబ్బు కి సరైన లెక్కలు చెప్పకపోతే 83 శాతం పన్ను అదనంగా చెల్లించాల్సి ఉంటుందట. చాలా వరకు పన్ను చెల్లింపుదారులు అనేక చట్టాలను ఆధారం చేసుకుని ఎగవేత విషయంలో అనేక రీతులుగా వ్యవహరిస్తున్న తరుణంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పారదర్శక పన్ను నిజాయితీని గౌరవించడం అనే విధానం ద్వారా పన్ను ఎగవేతదారుల కు భారీ మూల్యం చెల్లించే దిశగా అధికారులు వ్యవహరించినట్లు సమాచారం.
అది చెప్పలేకపోతే చీటీ చిరిగిద్ది….
సెప్టెంబర్ 25 నుండి మీ ఖాతాలో ఉండే డబ్బు బంగారం ఇంకా ఏదైనా విలువైన వస్తువు లేదా ఆస్తి యొక్క వివరాలు అసేసింగ్ ఆఫీసర్ కు దానికి సంబంధించిన ప్రతి వివరణని ఇచ్చిన సదరు ఆస్తి, నగదు లేదా బంగారం యొక్క ప్రయోజనా రుపాన్ని సరిగ్గా లెక్క గా అప్పజెప్పాలని లేకపోతే దాదాపు 83. 25 శాతం అధిక పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందని ఆర్థిక నిపుణులు తెలిపారు. అంతేకాకుండా మీ ఖాతాలో లెక్క చెప్పలేని డబ్బు గాని బంగారం గాని గత సంవత్సరం కట్టిన ఆదాయపు పన్ను లెక్కల్లో బయటపడని అన్యాయబద్ధమైన టాక్స్ కట్టి ఉంటే దానికి కేవలం ఆరు శాతం పెనాల్టీ తో పాటుగా 85% పన్ను చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మీ అకౌంట్ లో నేరుగా డబ్బు ఎలా వచ్చిందో ఎందుకు వచ్చింది? ఎవరు పంపించారు…? దాని ప్రయోజనం ఏమిటి..? వంటి విషయాలలో సరైన లెక్కలు చెప్పకపోయినా సరే పన్ను చెల్లింపుదారులు డు 85% టాక్స్ కట్టాల్సిందే అని తాజా రూల్స్ బట్టి అర్థమవుతుంది.
మోదీ మాయ ఇదంతా….
ముఖ్యంగా 2017 వ సంవత్సరం లో మోడీ డిమానిటైజేషన్ చేసిన తరుణంలో చాలా అకౌంట్లలో లెక్కా పత్రం లేని డబ్బులు భారీగానే వచ్చిపడ్డాయి. అయితే ఇప్పుడు సదరు అకౌంట్ హోల్డర్లు లెక్క అప్ప చెప్పాల్సిన పరిస్థితి ఉందని…. సరైన లెక్క చెప్పకపోతే 85 శాతం పన్ను చెల్లించాల్సి ఉందని … ఇది మామూలు విషయం కాదని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు. ఈ విషయంలో న్యాయస్థానానికి వెళ్లే అవకాశం కూడా లేదని ఇన్కమ్ టాక్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వాటిని అనుభవించాల్సి ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా 130 కోట్ల జనాభా కలిగిన దేశం లో కేవలం కొద్ది మంది మాత్రమే పన్ను చెల్లింపులు చెల్లిస్తున్న తరుణంలో…కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చిన “పారదర్శక పన్ను నిజాయితీని గౌరవించడం” అనే విధానంతో ఎవరైతే పన్ను చెల్లించాల్సిన స్థితిలో ఉండి కూడా చెల్లించటం లేదో వారి ఇళ్లలో ఉండే డబ్బు గుల్ల అయిపోయేలా అసేసింగ్ ఆఫీసర్ లు సెప్టెంబర్ 25 నుంచి రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం.