Lukewarm Water: ఎండాకాలం వచ్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయిలో ఎండలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఉష్ణోగ్రత ప్రపంచస్థాయిలో రెండో స్థానంలో నిలుస్తూ ఉంది. అయితే వేసవి కాలం వస్తే ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. డీహైడ్రేజేషన్.. వడదెబ్బ… అనేక చర్మ వ్యాధులు మరియు చుండ్రు పట్టడం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే వేసవి కాలంలో ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగటం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య లాభాలు తెలుసుకుందాం. వేసవి నీ దృష్టిలో పెట్టుకొని గోరువెచ్చని నీరు తీసుకుంటే దాహం తీర్చడం అసాధ్యమైన గాని మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అదే రీతిలో జీర్ణక్రియ మెరుగవుతుంది. రక్తనాళాలకు కూడా విస్తరిస్తూ రక్త ప్రసరణ మెరుగు పరిచయాల గోరువెచ్చని నీరు కీలకపాత్ర పోషిస్తుంది. అంతమాత్రమే కాదు కండరాల నొప్పిని తగ్గించే రీతిలో సహాయపడుతుంది. అందుకే కండరాలు నొప్పి ఉంటే గోరువెచ్చని నీరు తాగటం ఎంతో ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా భోజనానికి ముందు 500 మిల్లీ లీటర్లు గోరువెచ్చని నీరు తాగటం వల్ల జీర్ణక్రియ 30 శాతం మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది.
ఇదే సమయంలో రోజు ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల బరువు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కొవ్వు బర్నింగ్ చేయడంతో పాటు రక్త ప్రసరణ సక్రమంగా నిర్వహించడం.. వంటివి గోరువెచ్చని నీటితో మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా ఇంకా శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి.. జలుబు, గొంతు నొప్పి.. వ్యాధులకు ఉపశమనం విషయంలో వేడి నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. సో వేడి నీళ్ళు తీసుకోవడం వల్ల..అనేక ఆరోగ్య లాభాలు కలుగుతాయి.