ఏక్కువ మంది డెంగీ జ్వరాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాలు విపరీతంగా,విస్తరిస్తూన్నాయి.డెంగీ వచ్చిందని భయపడాల్సిన పని ఏమాత్రము లేదు. సరైన చికిత్స తీసుకుంటే డెంగీ జ్వరం తగ్గిపోతుంది . ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. డెంగీ దోమలు పగలు మాత్రమే కుడతాయి. కుట్టినప్పుడు మనకు నొప్పి తెలీదు. ఇవి 100మీటర్లు దాటి ప్రయాణం చెయ్యలేవు. సాధారణంగా శరీరంలో కాళ్లు, పాదాల వంటి కింది భాగాల్లోనే ఎక్కువ గ కుడతాయి. ఈ దోమ చూడటానికి కాస్త పెద్దదిగా, నల్లటి చారల తో ఉంటుంది. దీనిని టైగర్ దోమ అని కూడా పిలుస్తారు… డెంగీ దోమ నుంచి తప్పించుకునేదెలా తెలుసుకుందాం.
ఈ దోమ మనం మెలకువగా ఉన్న సమయంలోనే కుడతుంది. ఎక్కువ దూరం ప్రయాణించలేవు కాబట్టి ,మన చుట్టూ ఉండే 100 మీటర్ల దూరంలోపు ఎక్కడా నీటి నిల్వ లేకుండా ఉండేలా చూసుకోవాలి. మన చుట్టుపక్కల ప్లాస్టిక్ బాటిల్స్ , పాత టైర్లు,నీటి కుండీ లు లాంటివి ఉండకుండా చూసుకుంటే మంచిది. మస్కిటో కాయిల్స్ లాంటివి దగ్గర ఉంచుకోవడం అన్నిటికన్నా ముఖ్యం . టేబుల్స్, కర్టెన్స్ దోమలు దాక్కొని ఉంటాయికాబట్టి, ఆ ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అవసరమైతే దోమలు కుట్టకుండా ఉండేందుకు మార్కెట్లో కొన్ని క్రీములు లభిస్తున్నాయి. వాటిని ఉపయోగించడం మంచిది.డెంగీ లక్షణాలు ఎలాఉంటాయో తెలుసుకుందాం..డెంగీ జ్వరం వస్తే, టెంపరేచర్ 105 వరకు వచ్చే అవకాశం ఉంది. తలనొప్పి, ఒళ్లు నొప్పుల…అలాగే, కండరాలు, ఎముకలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. వికారంగా వాంతులు వచ్చినట్లు అనిపిస్తుంది. కొందరిలో వాంతులు కూడా అవుతాయి. కళ్ల వెనుక నొప్పిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఉమ్మినీటి గ్రంథులు వాపునకు లోనై కనిపిస్తాయి.
అయితే, జ్వరం ఉన్నప్పటి కంటే,తగ్గిన తర్వాత డెంగీ ప్రమాదకరంగా మారుతుంది. శరీరంపై ఎర్రటి మచ్చలు రావడం, ప్లేట్ లెట్స్ పడిపోవడం, బీపీ తగ్గడం లాంటివి జరగుతుంటాయి. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించాల.ప్లేట్ లెట్స్ పెరగడానికి ఉపయోగపడే ఆహారం తీసుకోవాలి.బొప్పాయి పండ్లు లేదా ఆ మొక్క ఆకుల రసాన్ని స్వల్ప మొత్తంలో తీసుకోవడం ద్వారా రక్తంలో ప్లేట్లెట్లు పెరిగి త్వరగా కోలుకుంటారు. అలాగే కివీ లు, దానిమ్మ పండ్లను తీసుకున్నా శరీర రోగ నిరోధక శక్తి పెరిగి పేషెంట్లు త్వరగా కోలుకుంటారు.