Money: ఒక వ్యక్తి నాకు చాలా దగ్గరి వాడు లేదా నా ప్రాణ స్నేహితుడు అని నమ్మి డబ్బు ఇస్తే,ఆ డబ్బు తిరిగి ఇచ్చే సమయానికి ఆ వ్యక్తి తో సమస్యలు వస్తే ఆ డబ్బును రాబట్టుకోవడం అంటే చాలా చాలా కష్టమైన పనే అని చెప్పక తప్పదు. డబ్బులు ఎవరికి ఇచ్చినా, ఎంత మొత్తంలో వడ్డీకి ఇచ్చిన వెనక్కి తిరిగి రావడానికి సరైన పద్ధతిలో ప్రామిసరీ నోటు చేయించుకోవలసి ఉంటుంది. సరైన పద్ధతిలో ప్రామిసరి నోటు ఉంటే కచ్చితంగా డబ్బు మళ్ళీ వెనక్కి వస్తుంది .ఏదైనా కారణం చేత డబ్బు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వనంటే మొండికేస్తే కోర్టు లో ఆ ప్రామిసరి నోటు ఆధారం గా డబ్బులు రాబట్టుకోవచ్చు.
కాబట్టి డబ్బు ఇచ్చినప్పుడు ప్రామిసరి నోటు రాయించుకోవడం లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.కోర్టులలో చెల్లే విధంగా ప్రామిసరి నోటు ఉండాలని, లేదంటే ఆ డబ్బు లకు ఎటువంటి భద్రత లేనట్లే అంటున్నారు న్యాయవాదులు.ప్రామిసరీ నోటు రాసే విషయంలో సాధారణంగా చేసే తప్పులు ఏమిటో తెలుసుకుందాం. రాయించుకున్న ప్రామిసరీ నోట్లు పై స్టాంపులు లేకపోవడం, జామీను (డబ్బు తీసుకున్న వారి )సంతకం తీసుకోక పోవడం, సాక్షి సంతకం చేయించుకో పోవడం , ప్రామిసరి నోటు సొంత దస్తూరితో(చేతి రాత ) తో రాయించుకో పోవడం, ఈ తప్పులు జరగకుండా చూసుకోవాలి.
ఎంత డబ్బుకు ప్రామిసరి నోటు రాయించుకున్న కూడా కచ్చితంగా స్టాంపులు అంటించాలి. డబ్బు తీసుకున్న వ్యక్తి సంతకం స్టాంపు మీదుగా వచ్చేలా చేయించుకోవాలి.ఇక ప్రామిసరి నోటులో జామీను అనే ఆప్షన్ ఉంటుంది..చాలా మంది దాన్ని పట్టించుకోరు.
కానీ అది చాలా ముఖ్యమైనది. అప్పు తీసుకున్న వ్యక్తి తప్పనిసరిగా మరో వ్యక్తి ని తన జామీను గా పెట్టాలి.