వర్షాకాలం వచ్చిందంటే చాలు రోగాల కు కొరత ఉండదు. వైరల్ ఫీవర్ల నుంచి ఇన్ఫెక్షన్ల వరకు ప్రతి ఒక్కటీ మన సహనాన్ని పరీక్షిస్తాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పాదా లను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. బురద, వర్షపు నీటిలో నడవడం వల్ల పాదాలు ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురవ్వుతాయి. అవి అంతటితో ఆగకుండా రకరకాల చర్మ వ్యాధులకు కారణమవుతాయి.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి.కొన్ని చిట్కాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే కరోనా కారణం గా హాస్పిటల్కు వెళ్లాలన్నా భయమే. పరిస్థితి అంతవరకు వెళ్లకూడదంటే జాగ్రత్తగా ఉండటం ఒక్కటే మార్గం. వర్షంలో తడిసినా, వర్షపు నీటిలో నడిచినా ఇంటికి రాగానే కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. ఆతర్వాత కొంచెం వేడి గా ఉన్న నీటిలో ,ఉ ప్పు వేసి 5 నిమిషాల తర్వాత తీసి మాములు నీటితో శుభ్రం చేసుకుని అనంతరం తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. కాలివేళ్ల మధ్య తడి లేకుండా చూసుకోవాలి. వర్షాకాలంలో షూస్ ధరించకూడదు. ఎందుకంటే వర్షంలో తడిసినపుడు లేదా వర్షపు నీటిలో నడిచినపుడు షూస్ బాగా తడిసి పాదాలకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి షూస్కు బదులుగా తేలికగా ఉండే స్లిప్పర్స్, శాండిల్స్ వేసుకోవాలి. రాత్రి నిద్రపోవడానికి ముందు పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. మాయిశ్చరైజర్ అందుబాటులో లేనట్లయితే ఆలివ్ లేదా ఆల్మండ్ ఆయిల్ను రాసుకోవచ్చు. వేళ్ల మధ్య వీటిని రాయొద్దు.వర్షాకాలంలో పాదాలకు పగుళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి పాదాలకు ఉండే మృతచర్మం తొలగిపోయేలా స్క్రబ్బర్తో బాగా రుద్దాలి.
వారానికి ఒకసారి ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవడం అలవరుచుకోవాలి. ఒక చిన్న టబ్లో గోరు వెచ్చటి నీళ్లు పోసి దానిలో నిమ్మరసం, హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసి బాగా కలిపి అందులో పది నిమిషాల పాటు పాదాలు పెట్టాలి. స్క్రబ్బర్తో పాదాలను శుభ్రం చేసుకోవాలి. కాళ్ల గోర్లను శుభ్రం చేసుకోవడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించవచ్చు. పెడిక్యూర్ తర్వాత పాదాలను తడి లేకుండా తుడిచి మాయిశ్చర్ను అప్లై చేయాలి.మధుమేహం వ్యాధిగ్రస్తులు తమ పాదాల పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకితే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి. ఎందుకంటే.. పాదాలపై ఏమైనా పుండ్లు ఏర్పడితే వీరికి అంత త్వరగా తగ్గవు. తడిచి బయట నుండి రాగానే పిల్లలు అయినా పెద్దలుఅయిన కొంచెం చేతిలోకి హ్యాండ్ వాష్ తీసుకుని పాదాలకి బాగా రుద్ది వేడినీటితో కడిగేసుకున్న కూడా మంచి ఫలితం ఉంటుంది . వర్సాకాలంలో బయట తిరిగి వచ్చాక పాదాలు దురదగా అనిపిస్తాయి. అప్పుడు కొద్దిగా నిమ్మ రసం, వెనిగర్ మిక్స్ చేసి దురద ఉన్న చోట రాస్తే మంచి ఫలితం ఉంటుంది.వర్షాకాలంలో ఓపెన్ ఫుట్ వేర్ ఎంచుకోవాలి. పాదాలు కప్పి ఉండే చెప్పులు, షూ ధరించడం వల్ల, చర్మానికి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి… కాస్త గాలి తగిలేలా ఉండే చెప్పులు ధరించాలి.ఫుట్ వేర్ దుమ్ము, ధూళితో కూడి ఉంటే.. వర్షాకాలంలో బ్యాక్టీరియా, క్రిములను ఎక్కువగా గ్రహిస్తుంది. కాబట్టి.. పాదరక్షలు శుభ్రంగా, డ్రైగా ఉండేలా జాగ్రత్త పడాలి.