సీజన్ మారడంతో చాలా మంది జ్వరం, దగ్గు ఇతరత్రా సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా అంటు వ్యాధులు కూడా ప్రభలే అవకాశం కూడా లేకపోలేదు.అలాగే దోమలు కూడా ఈ కాలంలోనే ఎక్కువగా ఉండడం చేత విషజ్వరాలు బారిన పడే వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి జ్వరాలు ఈ కాలంలోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి.వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం..!
సీజనల్ వ్యాధులు -తీసుకోవలిసిన జాగ్రత్తలు :
ఈ కాలంలో డెంగీ జ్వరాలు బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే డెంగీ జ్వరం వచ్చిన 90 శాతం మందికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడయితే ప్లేట్లెట్స్ కౌంట్ అనేది 10 వేల కంటే తగ్గుతుందో అప్పుడే ప్రమాదకరంగా మారుతుంది. ఈడిన్ ఈజిప్టై అనే దోమ డెంగీ జ్వరం రావడానికి కారణంగా చెప్పవచ్చు. ఈ దోమ కుట్టిన 3-7 రోజుల తర్వాత డెంగీ జ్వరం యొక్క లక్షణాలు బయట పడతాయి. హఠాత్తుగా తీవ్ర జ్వరం వస్తుంది. కళ్ల వెనుక భాగంలో నొప్పి, కండరాల్లో నొప్పి, శరీరంపై ఎర్రని దద్దుర్లు వస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డెంగీ టెస్ట్ చేయించుకోవాలి.
నిర్లక్ష్యం వద్దు :
అలాగే బ్యాక్టీరియా కారణంగా టైఫాయిడ్ సోకూతుంది.కలుషిత ఆహారం, నీళ్లు తాగితే ఈ వ్యాధి వస్తుంది. తీవ్ర జ్వరం, తలనొప్పి, వాంతులు, కడుపులో నొప్పి, వీరోచనాలు తదితర లక్షణాలు కనిపిస్తాయి.అలాగే ఈ కాలంలో ఎక్కువగా పాములు కూడా సంచరిస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి.పాము కరిస్తే నిర్లక్ష్యం చేయకుండా బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
నివారణ చర్యలు :
మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వ్యాధులు దాడి చేయకుండా దోమల నియంత్రణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.రోడ్లపైన గుంతలు, ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.ఇంటిలోపలికి దోమలు రాకుండా దోమల మెష్,దోమ తెరలు,దోమల నియంత్రణ పద్ధతులను పాటించాలి. ఈ కాలంలో ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగడం మంచిది కాదు. బయట ఆహారానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. కాచి చల్లార్చి వడబోసిన నీటిని తీసుకోవడం మంచిది. లేదంటే ఇంట్లో ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి.