Face Pack: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.. చర్మంలో కాంతి ఉంటే అందంగా కనిపిస్తారు.. ముఖం పై నల్లని మచ్చలు వారి ముఖాన్ని అందంగా కనిపించనివ్వకుండా అడ్డుకుంటాయి.. మార్కెట్లో దొరికే వివిధ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల తాత్కాలిక ఫలితాలను మాత్రమే పొందుతున్నారు.. ఇంట్లో లభించే వీటితో మీ ముఖం అందంగా చేసుకోవచ్చు..!
బియ్యం పిండి చర్మాన్ని మెరిపిస్తుంది. పూర్వకాలం నుండి బియ్యం పిండి సౌందర్య లేపనంగా ఉపయోగిస్తారు. ఇవి చర్మ సమస్యలను తగ్గించడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మంపై ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. బియ్యం పిండి చర్మానికి బ్లీచ్ , స్క్రబ్ లాగా పనిచేస్తుంది. అటువంటి బియ్యం పిండి తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే అధ్బుతమైన ఫలితాలు కలుగుతాయి. ముందుగా ఒక కప్పులో బియ్యప్పిండి ని తీసుకొని అందులో కొద్దిగా కలబంద గుజ్జు, తేనె వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి. ఈ ప్యాక్ చర్మం పై ఉన్న మృతకణాలను తొలగించి చర్మ రంధ్రాలను శుద్ధి చేస్తుంది. ముఖం మెరిసేలా చేస్తుంది.
ఒక కప్పు బియ్యప్పిండి లో, ఒక చెంచా చొప్పున శనగ పిండి, తేనె, కొబ్బరి నూనె, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఈ ప్యాక్ ముఖానికి అప్లై చేసుకోని అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇది చర్మానికి మంచి స్క్రబ్ లా ఉపయోగపడి మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. డార్క్ సర్కిల్స్ ను తొలగిస్తుంది. గ్లాసి స్కిన్ మీ సొంతమవుతుంది.