Weight Loss : ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా ఎంతోమంది వారి ఆహార విషయంలో కూడా మార్పులు చోటు చేసుకున్నారు ఫలితంగా అధిక శరీర బరువు పెరగడంతో ఊబకాయ సమస్య వేధిస్తోంది. ఎంతో మంది యువతీ, యువకులు, చిన్న పిల్లలు ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే బరువు తగ్గాలని ఎంతో మంది డైట్ ఫాలో అవ్వడం కూడా మనం చూస్తుంటాం. ఇందులో భాగంగానే రాత్రిపూట అన్నం మానేసి చపాతీ తినడం వల్ల బరువు తగ్గుతారని చాలామంది చూస్తుంటారు. అదేవిధంగా చాలామంది ఈ విధానాన్నే అనుసరిస్తున్నారు.అయితే శరీర బరువు తగ్గాలనుకొనే వారు రాత్రి పూట అన్నం బదులుగా చపాతీలను తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లు అవుతుందని కొందరు సూచిస్తున్నారు.
సాధారణంగా కొంతమందిలో సీలిక్ డిసీస్, వీట్ అలర్జీ, ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇబ్బందుల వల్ల అధికంగా విరేచనాలు కావడం, తీవ్రమైన తలనొప్పి బాధిస్తుంటుంది. అయితే ఇవన్నీ కూడా రాత్రి సమయంలో చపాతీ తినడం వల్ల తలెత్తుతాయని చెప్పవచ్చు. ఒకవేళ గోధుమలు మన శరీరానికి సరిపడిన అందులో ఉన్నటువంటి జిగట పదార్థం మన ప్రేగులకు అంటిపెట్టుకుని సరిగా జీర్ణం కాకుండా అడ్డుపడటం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందించలేవు.
రాత్రి వేళల్లో చపాతీ తినడం వల్ల కలిగే సమస్యలు:
సాధారణంగా మధుమేహంతో బాధపడే వారు రాత్రి సమయంలో చపాతీ తినడం వల్ల శరీరంలోని చక్కెర స్థాయిలు నిలకడగా ఉంటాయని చాలా మంది భావిస్తుంటారు. కానీ చపాతీ తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి పెరిగే అవకాశాలున్నాయని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలామందిలో రాత్రి సమయంలో గోధుమ రొట్టెలు తినడం వల్ల కడుపులో మంట, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో దొరికే గోధుమ పిండి కూడ రిఫైన్డ్ విధానంలో తయారు చేస్తారు కాబట్టి ఇది కూడా ఒక విధమైన అనారోగ్య సమస్యలు తలెత్తడానికి కారణం అవుతుంది. రాత్రి సమయంలో చపాతీలు తినాలని భావించే వారు వైద్యుల సలహా మేరకు వాటిని తరచూ ఆహారంగా తీసుకోవడం మంచిదని తెలియజేస్తున్నారు.