స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలామంది టీవీ లు కంటే ఎక్కువగా మొబైళ్ల నే చూస్తున్నారు. అయితే, కొంతమంది రాత్రిళ్లు నిద్రను సైతం పక్కన పెట్టి మరీ వీటిని చూస్తున్నారు. ఇలాంటివి చేస్తూ ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. నిద్రమానుకొని మరి మొబైల్ చూడటం వల్ల రెండు రకాల ప్రమాదాలు పొంచివున్నాయి.
ఒకటి మొబైల్ లైటింగ్ వల్ల కళ్లు, రేడియేషన్ వల్ల మెదడు దెబ్బతింటాయి. రెండోది, నిద్రలేమి వల్ల కొత్త వ్యాధులు శరీరం పై దాడి చేస్తాయి.రోజుకు మనిషి కనీసం 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. వయోవృద్ధులు, పిల్లలు రోజుకు తప్పనిసరిగా 10 గంటలు నిద్రపోవాలి. కనీసం 6 గంటలైనా నిద్ర లేకపోతే మనం చేతులారా ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నట్లే.6 గంటల కన్నా తక్కువ నిద్రపోయేవారు రోజంతా నీరసంగా, నిరుత్సాహంగా ఉంటారు. ఏ పని చేయలేరు, చురుకుదనం లోపిస్తుంది.నిద్రలేకపోతే పనిమీద ఏకాగ్రత ఉండదు.
నిద్రలేమి సమస్య మెదడుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.సరిగా నిద్రపోనివారికి ఆయుష్షు తగ్గిపోతుందని తేలింది.
తగిన నిద్రలేకపోతే జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది.
విద్యార్థులు తప్పకుండా 7 గంటలు నిద్రపోవాలి. లేకపోతే చదువుకున్నవి ఏవీ గుర్తు ఉండవు.
పరీక్షల సమయంలో విద్యార్థులు రాత్రంతా చదివి.. త్వరగా లేచి ఎగ్జామ్స్కు వెళ్తారు. నిద్రలేక మెదడు మొద్దుబారి చదివిని మరిపోతారు. నిద్రలేకపోతే శరీరానికి తగిన ఆక్సిజన్ లభించదు.
శరీరానికి ఆక్సిజన్ అందకపోతే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయి.
శరీరానికి సరిపడా నిద్రలేకపోతే ‘డిప్రెషన్కు గురువుతారు.
డిప్రెషన్ వల్ల ఇతరాత్ర అనారోగ్య సమస్యలు శరీరంపై దాడి చేస్తాయి.
నిద్రలేమి సమస్య ఊబకాయం, బరువు పెరగటం వంటి సమస్యలకు దారి తీస్తుంది. స్త్రీ, పురుషుల్లో సెక్స్ కోరికలు తగ్గుతాయి.
నిద్రలేమి వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గి సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది.నిద్రలేమి సమస్య వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి.
నిద్రలేమి ప్రాణాలను కూడా తీస్తుంది.నిద్రపోయే ముందు సెల్ఫోన్, కంప్యూటర్కు దూరంగా ఉండండి. మంచి నిద్రకు దగ్గరై ఆరోగ్యం గా ఉండండి .