Diabetes: రక్తంలో లో చక్కెర స్థాయి హెచ్చుతగ్గుల ఆధారంగా డయాబెటిస్ వస్తుంది.. మధుమేహం వచ్చిన తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవటం పెద్ద సవాల్.. వేసవి కాలం వచ్చేసింది.. ఈ సీజన్ కు తగ్గట్టుగా మీ డైట్ ను సెట్ చేసుకోవాలి. షుగర్ తో బాధపడుతున్న వారు మీ డైట్ లో ఈ పండ్లు యాడ్ చేసుకుంటే.. డయాబెటిస్ లెవెల్స్ తగ్గడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!!
వేసవిలో ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. చక్కెర ను నియంత్రించే వాటిలో జామకాయ ముందుంటుంది.. ఆహారం జీర్ణమవడానికి ఈ పండు సహాయపడుతుంది మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమైతేనే గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. షుగర్తో బాధపడుతున్న ఉన్నవారు ఆపిల్ ను నిరభ్యంతరంగా తినవచ్చు. ఆపిల్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ బాగుంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.
డయాబెటిక్ పేషెంట్ లకు గొప్ప వరంగా బొప్పాయి చెప్పవచ్చు. మన శరీరానికి అవసరమైన పీచు పదార్థాలు బొప్పాయి లో లభిస్తాయి. ఈ వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. డయాబెటిస్ తగ్గడానికి దోహదపడుతుంది. నేరేడు పండు డయాబెటిస్ వారికి సూపర్ ఫ్రూట్. నేరేడు పండునే కాకుండా వాటి విత్తనాలను పొడిచేసి తీసుకున్నా కూడా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు బ్లూబెర్రీ ఉత్తమ పండుగ ఆరోగ్య నిపుణులు చెబుతారు. దీన్ని తీసుకోవడం వలన షుగర్ తో పాటు ఊబకాయము కూడా తగ్గుతుంది. వేసవి కాలంలో బొప్పాయి, జామ, స్ట్రాబెర్రీ, యాపిల్, నేరుడు కచ్చితంగా తినండి.