Ukraine Crisis: ఉక్రెయిన్ ను వశం చేసుకునేందుకు రష్యా యుద్దం చేస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతినుద్దేశించిన బైడెన్ చేసిన ప్రసంగంలో ఉక్రెయిన్ – రష్యా యుద్ధంపై మాట్లాడారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను చుట్టుముట్టి యుద్ధ ట్యాంకులతో రష్యా దాడి చేస్తోందనీ, ఉక్రెయిన్ ప్రజల హృదయాలను రష్యా ఎప్పటికీ పొందలేదని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా మద్దతుగా ఉంటుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ తరపున అమెరికా సేనలు యుద్ధం చేయవు అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ ను రష్యా వశం కానివ్వమని అన్నారు. నియంత పుతిన్ అంతు చూస్తామని హెచ్చరించారు. ఉక్రెయిన్ ను రష్యా ముట్టడించినా ప్రజల మనసులు పునిత్ గెలుచుకోలేరని బైడెన్ అన్నారు.
Read More: Breaking: ఈయూ కీలక నిర్ణయం..ఉక్రెయిన్ కు సభ్యత్వం
Ukraine Crisis: ఆమెరికాలో రష్యా విమానాలపై నిషేదం
రష్యా ఆర్ధిక వ్యవస్థను స్తంభింపచేస్తామని బైడెన్ హెచ్చరించారు. అమెరికా, దాని భాగస్వామ్య దేశాలు, నాటోలోని ప్రతి అంగుళం భూభాగాన్ని కాపాడుకుంటాయని అన్నారు. యుద్దరంగంలో పుతిన్ లాభపడొచ్చు కానీ దీర్ఘకాలంలో భారీ మూల్యం చెల్లించకతప్పదని బైడెన్ హెచ్చరించారు. ఆమెరికాలో రష్యా విమానాలపై నిషేదం విధిస్తున్నట్లు తెలిపారు. పుతిన్ ను ప్రపంచం ఏకాకి చేయాలని బైడెన్ అన్నారు. కాగా గత ఆరు రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతోంది. ఉక్రెయిన్ లో పౌరులు సైతం తుపాకి చేతపట్టి రష్యా సేనలతో తలపడుతున్నారు. రష్యా సేనలను ఉక్రెయిన్ పౌరులు అడ్డుకుంటున్నారు.
ఆణ్యస్త్ర దళాలను అప్రమత్తం చేసిన రష్యా
రష్యా క్షిపణుల దాడిలో ఉక్రెయిన్ లోని పెద్ద ఎత్తున నివాస భవనాలు ధ్వంసమవుతున్నాయి. అనేక మంది పౌరులు మృత్యువాతపడుతున్నారు. మరో పక్క సైబీరియాలో సైనిక డ్రిల్స్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. బారెంట్స్ సముద్రంలోకి రష్యా అణు జలాంతర్గాములు ప్రవేశించాయి. సైబీరియాకు మొబైల్ క్షిపణి లాంఛర్లును రష్యా తరలించింది. విన్యాసాల్లో అణు జలాంతర్గాములు, యుద్ధ నౌకలు పాల్గొంటాయని రష్యా పెర్కొంది. రష్యా ఆణ్యస్త్ర దళాలను అప్రమత్తం చేయడంతో ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైంది.