Devatha Serial: దేవి గురించి మాట్లాడడానికి ఆదిత్య దగ్గరకు వెళ్తుంది. అంతలో రాధ ఆఫీస్ కి రావడం చూసిన రమ్య ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. పిల్లల గురించి మీ సార్ తో పోట్లాడడానికి వచ్చాను అని చెబుతోంది. రాధ ఆదిత్యతో మాట్లాడడానికి లోపలికి వెళ్లగానే రమ్య మాధవ్ కి ఫోన్ చేసి.. ఆదిత్యతో మాట్లాడడానికి రాధ ఎందుకు ఆఫీస్ కి వచ్చిందని.. ఏం పని ఉందని వచ్చిందని.. రాధ పై మాధవ్ మనసులో అనుమానం క్రియేట్ చేస్తుంది..!
రాధా ఏం చెబుతుందో వినకుండా ఆదిత్య నువ్వు ఇక్కడికి నాతో గొడవ పెట్టడానికి వచ్చావని నాకు తెలుసు. నేనంటే అర్ధరాత్రి కూడా లేచి పరుగున వచ్చే దేవికి.. అంతగా నామీద విషం ఏమి నూరిపోసావు. తన మనసు విరిగిపోయేలాగా తనకి ఏం చెప్పావ్.. రాక్షసులు కూడా తమ బిడ్డలకు తమ తల్లిదండ్రులు రాక్షసులు కారు అని చెబుతారు. నువ్వు మాత్రం నీ కన్న బిడ్డ మనసులో తన తండ్రి పై విషన్ని నింపుతున్నావ్.. రాధ నేను చెప్పేది విను పెనిమిటి అని ఎంత నచ్చచెప్పాలని ప్రయత్నం చేసినా.. నువ్వు నాతో ఏమీ మాట్లాడుతూ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పంపిచేస్తాడు.
రాధా ఇంటికి వెళ్లేసరికి సత్య తనకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రేపు శివరాత్రి కదా అక్క నీకు చీర పెడదామని తీసుకువచ్చాను తీసుకో అని అంటుంది. నాకు ఏమి వద్దు అని రాధా తీసుకోదు. సత్య ఏడుస్తుంటే మనసు కరిగిపోయి తీసుకుని తనకు కుంకుమ బొట్టు పెట్టి ఆశీర్వదించుతుంది. శివరాత్రికి ఉపవాసం ఉంటే కోరిక నెరవేరుతుందని తెలుసుకున్న దేవి కూడా ఉపవాసం ఉంటానని చెబుతోంది. దేవి మనసులో ఉన్న కోరిక ఏంటో తరువాయి భాగంలో తెలుసుకుందాం.