afghanistan: ఆప్ఘనిస్తాన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకోవడంతో ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయాడు. ఇప్పటికే తాలిబన్లు దేశాన్ని పూర్తిగా తమ కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు. ఎలాంటి హింసకు తావు లేకుండానే దేశంలో శాంతియుతంగా అధికార బదిలీ చేస్తామని ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఆ దేశానికి కొత్త అధ్యక్షుడు ఎవరనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
శ్రీధర్ అన్న డబ్బులు వేస్తే నీకు పంపించే అకౌంట్ ఏమైనా ఉందా అనడం వేరు.
Read More: America :ఇండియన్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా కొత్త అధ్యక్షుడు
పాత ఘనీ బదులు కొత్త ఘనీ….
తాలిబన్లు ఆక్రమించుకోవడంతో ఆ దేశ నూతన అధ్యక్షుడిగా తాలిబన్ కమాండ్ ముల్లా అబ్ధుల్ ఘనీ బరాదార్ అనే మరో ఘనీకి ఆఫ్ఘన్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అబ్దుల్ ఘనీ.. ఆఫ్ఘన్ ముజాహిద్ కమాండర్ ముల్లా ఉమర్తో కలిసి గతంలో తాలిబన్ సంస్థకు నాయకుడిగా పనిచేశారు. తాలిబన్లు పాలించిన సమయంలో రెండు రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరించిన అనుభవం కూడా ఆయనకు ఉంది. తాలిబన్లే దేశాన్ని పాలించనున్న క్రమంలో అధ్యక్ష బాధ్యతలు ఆయనకే అప్పగించే ఆలోచనలో ఉన్నారు. 2010లో పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు ఘనీని అరెస్ట్ చేశారు. తిరిగి 2018 అక్టోబర్ 24 వరకు పాక్ జైలులో శిక్షను అనుభవించారు. ఆ తర్వాత అమెరికా విజ్ఞప్తి మేరకు జైలునుంచి విడుదలయ్యారు.
Read More: Modi : వాళ్ల ఓట్ల కోసం భలే స్కెచ్చేసిన మోడీ
తాలీబన్లు చెప్పేది ఇదే…
తాలిబన్లు మాత్రం విదేశీయులకు ఎలాంటి హాని తలపెట్టమని, వారు భయపడాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఆఫ్ఘన్లో ఉన్న విదేశీయులు రిజిష్టర్ చేసుకోవాలని, వారు ఎప్పుడైనా స్వదేశానికి వెళ్లొచ్చని హామీ ఇచ్చారు. కాగా ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో దాదాపు 1500 మంది భారతీయులున్నారు. వారంతా తిరిగి ఇండియాకు వచ్చేయాలని విదేశాంగశాఖ ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో ఆ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్న ఘనీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో మరి.