Bomb warning call: ఇటీవల కాలంలో ప్రముఖుల ఇళ్లకు, రాష్ట్ర కార్యాలయాలకు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం ఎక్కువ అవుతోంది. గత ఏడాది తమిళనాడులో సీఎం పళనిస్వామి, తమిళనాడు సచివాలయానికి, సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసానిక బాంబు బెదిరింపు ఫేక్ కాల్స్ వచ్చాయి. నేడు తాజాగా మహారాష్ట్ర సచివాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడం కలకలాన్ని రేపింది.
మహారాష్ట్ర విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్ కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి సచివాలయ ప్రాంగణంలో బాంబును అమర్చినట్లు చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు బాంబును గుర్తించి నిర్వీర్యం చేసే స్క్వాడ్ ను పంపించారు. ఈ స్క్వాడ్ హుటాహుటిన సచివాలయానికి చేరుకుని క్షుణంగా తనిఖీలు చేసింది. స్క్వాడ్ తనిఖీలో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు. దీంతో ఇది ఫేక్ కాల్ గా పోలీసులు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఫేక్ కాల్ ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు చేశారు అనే దానిపై పోలీసు అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రాలయం భవనం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
Bomb Detection and Disposal Squad doing checking at Maharashtra Legislature Secretariat after a call at control room saying bomb placed in. Prima facie, it seems to be a hoax call. Further inquiry is being conducted: Mumbai Police pic.twitter.com/ztv7sr0nID
— ANI (@ANI) May 30, 2021