Balasore Train Accident: ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాద ఘటనలో 293 మంది మృతి చెందగా, వెయ్యి మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. గత నెలలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది. ఈ ప్రమాదానికి రాంగ్ సిగ్నలింగే కారణమని ఇటీవల రైల్వే భద్రత కమిషనర్ (సీఆర్ఎస్) దర్యాప్తు నివేదిక స్పష్టం చేసింది.
మరో పక్క ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ .. రైల్వే శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులను అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్) అరుణ్ కుమార్ మహాంత. సెక్షన్ ఇంజనీర్ మొహమ్మద్ అమిర్ ఖాన్, టెక్నిషియన్ పప్పుకుమార్ లు ఉన్నారు. సాక్ష్యాలను నాశనం చేయడం తదితర అభియోగాలను వారిపై సీబీఐ మోపింది.
Visakha: విశాఖలో ఏఆర్ ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు హోంగార్డులు అరెస్టు