Delhi Liquor Scam Case: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో సారి సమన్లు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రావాల్సిందిగా సమన్లు జారీ చేయడం ఇది నాల్గో సారి. తాజాగా ఆయనను జనవరి 18వ తేదీన ఈడీ ముందు హజరు కావాలని కోరింది. అరవింద్ కేజ్రీవాల్ కు గత ఏడాది నవంబర్ 2, డిసెంబర్ 21 న విచారణ కు హజరు కావాలని రెండు సార్లు సమన్లు జారీ చేసింది ఈడీ.
విచారణకు గైర్హజరు కావడంతో ఈ నెల 3వ తేదీన హజరు కావాలని మూడో సారి నోటీసులు జారీ చేసింది. మూడో సారి కూడా విచారణకు హజరుకాకపోవడంతో ఈడీ చర్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తినెలకొంది. కేజ్రీవాల్ ను అరెస్టు చేస్తారంటూ ఊహగానాలు వచ్చాయి. ఆప్ మంత్రులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కేజ్రీవాల్ నివాసానికి వెళ్లే మార్గంలో భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో తమ నేతను కేంద్రం ఇబ్బంది పెట్టాలని చూస్తొందని ఆప్ నేతలు ఆరోపించారు. ఆ ఆరోపణలను బీజేపీ ఖండించింది. సాధారణంగా మూడు సార్లు సమన్లు జారీ చేశాక ఈడీకి అరెస్టు చేసే అధికారం వస్తుంది. అయితే అందుకు భిన్నంగా ఈడీ మరో సారి సమన్లు జారీ చేసింది. విచారణకు హజరుకావాలని సమన్లు పంపింది.
దీంతో ఈ సారి జారీ చేసిన సమన్లపై అరవింద్ కేజ్రీవాల్ ఏ విధంగా స్పందిస్తారు అనేది అసక్తికరంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తో పాటు మరి కొందరు జైల్ లో ఉన్నారు.
Chandrababu: నేడు సీఐడీ ఆఫీసుకు చంద్రబాబు .. ఎందుకంటే..?