కేరళలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ లు రాజీనామాలు చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్ మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం (నేడు) ఉదయం 11.30 గంటలకల్లా రాజీనామాలు అందించాలని గవర్నర్ కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. కేరళలోని ఏపిజే అబ్దుల్ కలాం టెక్నాలాజికల్ యూనివర్శిటీ వీసీ నియామకం యూజీసీ నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ ఇటీవల సుప్రీం కోర్టు ఆ నియామకాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని తొమ్మిది వర్శిటీల వీసీలు రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఆదేశాలు జారీ చేయడం కేరళ అధికార, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. గవర్నర్ ఆదేశించిన 9 యూనివర్శిటీల్లో ఏపిజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్శిటీ కూడా ఉంది.
అయితే గవర్నర్ ఆదేశాలపై కన్నూరు యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ గోపీనాథ్ రవీంద్రన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు గవర్నర్ ఆదేశాలు అందాయనీ, కానీ తాను రాజీనామా సమర్పించడం లేదని స్పష్టం చేశారు. ఆర్ధిక అవకతవకలు, చెడు ప్రవర్తన లాంటివి ఇక్కడ జరగలేదని ఆయన పేర్కొన్నారు. అవి బూటకపు ఆరోపణలుగా ఆయన తెలిపారు. ఇంతకు ముందు కన్నూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ గోపీనాథ్ రవీంద్రన్ నియామకంపై వివాదం తలెత్తగా కేరళ హైకోర్టు ఆయన పునః నియామకాన్ని సమర్పించింది. ఇక ఇతర యూనివర్శిటీల వీసీలు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.
కేరళ ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై గవర్నర్ మొహమ్మద్ ఆరిఫ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం, లాటరీ వ్యాపారాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూస్తొందని కామెంట్స్ చేశారు. అంతే కాకుండా ఇది వింటుంటే తనకు సిగ్గుగా ఉందని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ కు పంజాబ్ అడ్డా అని కానీ త్వరలోనే కేరళ దానిని దాటేస్తుందని కూడా గవర్నర్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ విమర్శలు చేయడం ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య విభేదాలు బహిర్గతం అయినట్లుగా స్పష్టం అవుతోంది.
I have received the Kerala Governor's decision but I will not submit my resignation. A VC's resignation is based on financial irregularities & bad behaviour, neither of which has happened here. This is a fake accusation: Kannur University Vice-Chancellor Dr Gopinath Ravindran https://t.co/8jnItvWXD4 pic.twitter.com/aoEF2v4MIp
— ANI (@ANI) October 24, 2022