మరి కొద్ది గంటల్లో స్వగ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నామన్న వారి ఆనందం ఆవిరి అయ్యింది. బస్సు ప్రమాదం రూపంలో వాళ్ల ను కబళించింది. వీళ్లంతా బతుకు తెరువు కోసం యూపీ, బీహార్ నుండి తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రాంతంలో ఉంటూ వివిధ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారే. దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకునేందుకు శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుండి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. హైదరాబాద్ నుండి గోరఖ్ పూర్ వెళుతున్న ఈ బస్సు మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 15 మంది దుర్మరణం పాలవ్వగా, 40 మంది గాయపడ్డారు.
వీరు ప్రయాణిస్తున్న బస్సు జబల్ పుర్ దాటి ప్రయాగరాజ్ వెళుతున్న సమయంలో బస్సు ముందు వెళుతున్న ట్రక్కు మొదట ఓ గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి ట్రక్కను వెనుక నుండి ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. బస్సులో ముందు భాగంలో కూర్చుకున్న వారు మృత్యువాత పడ్డారు. బస్సు ప్రమాద విషయం తెలియడంతో పోలీసుుల హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారందరూ ఉత్తరప్రదేశ్ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ తీవ్ర దిగ్బాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం తో యోగి ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెగురైన వైద్యం అందించే విదంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి 50వేల వంతుల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు సీఎం యోగి.