Owaisi: హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా రాజకీయాల్లో తన సత్తా చాటుతున్న ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించామని అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. దీంతో అసద్ అడుగుల వెనుక లెక్క ఏంటనే చర్చ జరుగుతోంది.
Read More: KCR: కేసీఆర్ అవాక్కయ్యేలా చేస్తున్న కాంగ్రెస్
అసదుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన…
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు పెట్టుకోబోమని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించిన కొన్ని గంటల్లోపే అసదుద్దీన్ ఒవైసీ 100 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ముస్లింల జనాభా అధికంగా ఉన్న పశ్చిమ, సెంట్రల్, ఈస్ట్రన్ రీజియన్ల పరిధిలో అభ్యర్థులను నిలుపుతామని మజ్లిస్ యూపీ శాఖ అధ్యక్షుడు షౌకత్ అలీ చెప్పారు. బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మజ్లిస్ పార్టీ.. ఇప్పుడు యూపీలో పోటీ చేస్తున్నది. యూపీలో ఆ పార్టీ ఎన్నికల బరిలో నిలవడం ఇదే మొదటి సారి.
Read More: Congress: యూపీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు దిమ్మతిరిగిపోయే షాక్
యూపీలో హాట్ టాపిక్..
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.. మరో వైపు అయోధ్యలోని ధన్నీపూర్ గ్రామంలో ఉన్న ఐదెకరాల స్థలంలో మసీదు, హాస్పిటల్ను నిర్మించబోతున్నారు. అయితే ఈ కాంప్లెక్స్కు స్వాతంత్య్ర సమరయోధుడు మౌల్వీ అహ్మదుల్లా షా ఫైజాబాదీ పేరు పెట్టాలని ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) నిర్ణయించింది. ఈ మసీదు, హాస్పిటల్, మ్యూజియం, రీసెర్చ్ సెంటర్, కమ్యూనిటీ కిచెన్ మొత్తం ప్రాజెక్ట్ను ఫైజాబాదీకి అంకితమివ్వనున్నట్లు ఐఐసీఎఫ్ తెలిపింది. 1857 తిరుగుబాటులో రెండేళ్ల పాటు అవధ్ను బ్రిటీషర్ల నుంచి కాపాడిన యోధుడు ఫైజాబాదీ. ఈయననే “లైట్హౌజ్ ఆఫ్ ఇండిపెండెన్స్” అని పిలుస్తారు.