Piyush Goyal: కేంద్ర టెక్స్ టైల్ మంత్రి పీయూష్ గోయల్ కు బీజేపీ అధిష్టానం కీల బాధ్యతలు అప్పగించింది. రాజ్యసభలో అధికారపక్ష నేతగా పీయూష్ గోయల్ ఎంపికైయ్యారు. ఈ మేరకు జూలై 19 నుండి జరిగే వర్షాకాల సమావేశాల నుండి రాజ్యసభలో బీజేపీ నేతగా పీయూష్ వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని రాజ్యసభ సెక్రెటేరియేట్ కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ తెలియజేసింది.
Read More: CBI Court: సీబీఐ కోర్టులో కీలక పరిణామం..! జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా..!!
ఇంతకు ముందు రాజ్యసభలో అధికారపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించిన ధావర్ చంద్ గహ్లాట్ ఇటీవల కర్నాటక గవర్నర్ గా నియమితులైయ్యారు. దీంతో రాజ్యసభ పక్ష నేత బాధ్యతను బీజేపీ అధిష్టానం పీయూష్ గోయల్ కు అప్పగించింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇటవలే గోయల్ కు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ, జౌళి శాఖలను కేటాయించారు ప్రధాన మంత్రి మోడీ. పీయూష్ ఇప్పటికే కేంద్ర వాణిజ్య శాఖ బాధ్యతలను చూసుకుంటున్నారు.
రాజ్యసభకు రెండో సారి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ప్రస్తుతం ఎన్డీఏ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. 2014 లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు వరకూ బీజేపీ కోశాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. 2010 నుండి పీయూష్ రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్నారు. అయితే ఈ పదవికి కేంద్ర మంత్రి భూపేందర్ యూదవ్ కూడా పోటీ పడ్డారు. చివరకు పార్టీ అధిష్టానం పీయూష్ గోయల్ వైపే మొగ్గు చూపింది.