Priyanka Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాధ్రా కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. హర్యానాలో జరిగిన భూకంభకోణం కేసులో ప్రియాంక పేరును ఈడీ చేర్చింది. చార్జిషీటులో ప్రియాంక పేరును నమోదు చేయడం సంచలనంగా మారింది. హర్యానాలోని పరీదాబాద్ లోని అమీపూర్ గ్రామంలో 2005 నుండి 2008 వరకూ వందలాది ఎకరాల భూమి కొనుగోలు అమ్మకాలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
మనీలాండరింగ్ కేసులో ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త సీసీ థంపీని 2020లో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇంతకు ముందు చార్జిషీటులో రాబర్ట్ వాద్రా పేరను థంపీ సన్నిహితుడిగా ఈడీ పేర్కొన్నప్పటికీ ప్రియాంక పేరు ప్రస్తావనకు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ కేసులో పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ పై మనీలాండరింగ్, విదేశీ మారక ద్రవ్యం, నల్లధనం చట్టాల ఉలంఘన, అధికారిక రహస్యాల చట్టంపై పలు ఏజన్సీలు విచారిస్తున్నాయి.
రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ వాద్రా లను నిందితులుగా పేర్కొనకపోయినా థంపీ, వాద్రాల మధ్య సంబంధాన్ని ఏర్పరచడానికి భూమి లావాదేవీలను ఈడీ ప్రస్తావించింది. వాద్రా, థంపీ ల మధ్య జరిగిన ఇతర ఆర్ధిక లావాదేవీల వివరాలను కూడా ఈడీ అందజేసింది. వాధ్రా నుండి థంపీ ల్యాండ్ క్రూయిజర్ కారును కొనుగోలు చేశారని, దీనికి కోసం అతని నాన్ రెసిడెంట్ ఎక్స్ టర్నల్ ఖాతా నుండి చెక్కుల ద్వారా చెల్లింపులు చేశారని ఈడీ పేర్కొంది.
ఈడీ చార్జిషీటులో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఉన్న ప్రియాంక పేరును తొలిసారిగా పేర్కొనడాన్ని పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. ఇది కక్షసాధింపు చర్యేనంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
YS Sharmila: చేరిక ముహూర్తానికి వేళాయె..!