RTGS: ఇటీవల కాలంలో తక్షణ నగదు బదిలీకి ఎక్కువ మంది వినియోగదారులు ఆర్ టీ జీ ఎస్, నెఫ్ట్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. అయితే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్ (ఆర్ టీ జీఎస్) సేవలకు 18 గంటల పాటు అంతరాయం ఏర్పడనున్నట్లు ఆర్ బీ ఐ ప్రకటించింది,. ఈ నెల 17వ తేదీ శనివారం అర్థరాత్రి 12 గంటల నుండి ఆదివారం ఏప్రిల్ 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకూ 14 గంటల పాటు ఈ సేవలు నిలిచిపోతున్నట్లు తెలిపింది.
ఆర్ టీ జీ ఎస్ వ్యవస్థ అప్ గ్రేడ్ వల్ల ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు ఆర్ బీ ఐ వివరించింది. ప్రధానంగా డిజాస్టర్ రికవరీ టైమ్ ను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఆర్ టీ జీ ఎస్ సేవలకు అంతరాయం ఏర్పడినా నెఫ్ట్ సేవలు యథాతధంగా కొనసాగుతాయని ఆర్ బీ ఐ స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా ఆర్ టీ జీ ఎస్ సేవలు గత ఏడాది డిసెంబర్ 14 నుండి 24 గంటల సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.