Corona: కరోనా కలకలం కొనసాగుతున్న సమయంలో కీలకమైన వ్యాక్సిన్ విషయంలో మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. కరోనా టీకా డోసుల మధ్య విరామ సమయం పెంచడంతో ప్రమాదకరమని తేలింది. అమెరికా మెడికల్ అడ్వైజర్, ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోని ఫౌసీ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. విరామం పెంచడం వల్ల ప్రస్తుతం ఉన్న కొవిడ్ వేరియంట్ల బారినపడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అయితే, టీకాల సరఫరా తక్కువగా ఉంటే గడువు కొనసాగించవచ్చన్నారు.
Read More: Corona: కరోనాతో పిల్లలకు ప్రమాదం లేదు – ఎవరు ప్రకటించారో తెలుసా?
మనదేశంలో ఇదీ పరిస్థితి….
మన దేశంలో కొవీషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామ కాలాన్ని ప్రభుత్వం మొదట ఆరు నుంచి 8 వారాలకు.. ఆ తరువాత 12 నుంచి 16 వారాలకు పెంచింది. అంతకు ముందు మార్చి నెలలో అయితే 28 రోజులు ఉంటే సరిపోతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. మూడు నెలల్లో విరామ కాలాన్ని రెండు సార్లు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో అమెరికా మెడికల్ అడ్వైజర్, ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోని ఫౌసీ సంచలన వివరాలు వెల్లడించారు. బ్రిటన్లో విరామ సమయం పొడగించడంతో పలు రకాల వేరియంట్ల బారినపడ్డారని, ఈ మేరకు షెడ్యూల్ మేరకు టీకాల పంపిణీ చేపట్టాలని సిఫారసు చేస్తున్నట్లు ఫౌచీ చెప్పారు.
Read More: Corona: వాట్సాప్ తో కరోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవచ్చంటే…
భారత్ లో ఈ సమస్య పెద్దదే…
కొవిడ్ తో పోరాడేందుకు టీకాలు కీలకమని, ఎవరైనా ఇంతకు ముందు వైరస్ బారినపడినప్పటికీ టీకాలు వేయడం చాలా ముఖ్యమని అమెరికా మెడికల్ అడ్వైజర్ స్పష్టం చేశారు. భారత్తో పాటు పలు దేశాల్లో డెల్టా వేరియంట్ బలంగా ఉందని, టీకాలు వేసిన దేశాల్లో వ్యాప్తి తక్కువగా ఉందని విశ్లేషించారు. భారతదేశంలో ప్రజలకు వీలైనంత త్వరగా టీకాలు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్లో వచ్చే కరోనా థర్డ్, మరిన్ని వేవ్ల నుంచి ప్రజలను రక్షించడంలో వ్యాక్సిన్ కీలకమని ఆయన స్పష్టం చేశారు.