Corona: కరోనా కలకలం కొనసాగుతున్న సమయంలో అందరి దృష్టి పడిన వ్యాక్సిన్ విషయంలో ఉన్న రెండు సమస్యలకు పరిష్కారం త్వరలో దొరికే అవకాశం కనిపిస్తోంది. కరోనా నివారణకు ఉన్న ఏకైక మార్గమైన వ్యాక్సినేషన్ ప్రక్రియలో కీలకమైన టీకాల లభ్యత, అందుబాటు ధర అంశాలకు మన హైదరాబాద్ కేంద్రంగానే పరిష్కారం దొరకనుందని తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బయోలాజికల్-ఈ కంపెనీ నుంచి త్వరలో అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్ ఈ పరిష్కారం చూపనుందని పేర్కొంటున్నారు.
Read More: Corona: వాట్సాప్ తో కరోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవచ్చంటే…
ఇది పరిస్థితి…
ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి టీకాలు ఉన్నాయి. భారత్లో అందుబాటులోకి ఇప్పటికే వచ్చిన ఈ వ్యాక్సిన్ల ధరలను కేంద్రం ప్రకటించింది. అయితే, ప్రైవేట్ ఆస్పత్రుల్లో తీసుకుంటేనే డబ్బులు చెల్లించాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే, అందరికీ కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనుంది. అయితే, ప్రైవేటులో టీఆకాలు పొందేందుకు వాటి ధర భారీగా ఉండటం, కేంద్ర ప్రభుత్వం ఇవ్వనున్న టీకాలకు వ్యాక్సిన్ల కొరత ఉండటం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో టీకాల కొరతను అధిగమించడానికి కొత్త వ్యాక్సిన్లకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈ క్రమంలోనే త్వరలోనే బయోలాజికల్-ఈ సంస్థ నుంచి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది.
Read More: Corona: కరోనాతో పిల్లలకు ప్రమాదం లేదు – ఎవరు ప్రకటించారో తెలుసా?
గుడ్ న్యూస్ ఏంటంటే…
హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ 30 కోట్ల డోసుల సరఫరా కోసం ఇప్పటికే ఆర్డర్ కూడా ఇచ్చేసింది. దీంతో టీకాల కొరతకు పరిష్కారం దొరకనుంది. ఇక ఇప్పటి వరకు ఉన్న వ్యాక్సిన కంటే అతి తక్కువ ధరకే బయోలాజికల్ ఈ టీకా ఉండబోతోంది. తమ టీకాల ధర రెండు డోసులు కలిపి రూ. 650లోపే ఉంటుందని గతంలోనే ఆ సంస్థ ప్రకటించింది. అయితే, తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం బయోలాజికల్ ఈ టీకా ఒక్కో డోసు ధర రూ. 150కే ఉండనుందని సమాచారం. దీంతో అతి చవక వ్యాక్సిన్ బయోలాజికల్-ఈ టీకా కానుంది.