తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలోకి తన తనయుడు, డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ ను తీసుకుంటున్నారు. ఉదయనిధి చెపాల్ తిరుపల్లికేని నియోజకవర్గం నుండి 2021 ఎన్నికల్లో విజయం సాధించి ఏడాదిగా ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా, ఆయన త్వరలోనే మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు సీఎం స్టాలిన్. రేపు (డిసెంబర్ 14న) ఆయన మంత్రివర్గంలోకి చేరుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఉదయనిధి స్టాలిన్ ను కేబినెట్ లోకి తీసుకోవడంతో పాటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా చేయనున్నారని వార్తలు వినబడుతున్నాయి.
ఈ అంశంపై డీఎంకే అధికార ప్రతినిధి రవీంద్రన్ స్పందిస్తూ .. ఉదయనిధి మంత్రి పదవి చేపట్టాలని పార్టీ నేతలు చాలా రోజులుగా కోరుకుంటున్నారని చెప్పారు. అయితే ఈ అంశం సీఎం స్టాలిన్ చేతిలోనే ఉందని అన్నారు. ఇప్పటికే యువజన విభాగం అధ్యక్షుడుగా ఉన్న ఉదయనిధికి యువతను ఆకట్టుకునే కీలక విభాగానికి మంత్రిని చేసే అవకాశం ఉందని అంటున్నారు. దాదాపుగా ఉదయనిధికి యువజన క్రీడా మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే దీని గురించి ఉదయనిధిని మీడియా ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. ఈ వార్తలపై అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పళని స్వామి స్పందిస్తూ కుటుంబ పార్టీగా డీఎంకే మారిపోయిందని విమర్శించారు. ఇక సీనియర్ లకు డమ్మీ శాఖలను కేటాయించబోతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు.
KCRs BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్