ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ తొ ఇన్నింగ్ లో భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్ కు దాసోహం అంటోంది. కేవలం 41 పరుగులకే నాలుగు వికెట్లు నష్టపోయి పీకలోతు కష్టాల్లో కూరుకుపోయింది. మురళీ విజయ్ 11, లోకేష్ రాహుల్ 2, కెప్టెన్ విరాట్ కోహ్లీ 3, వైస్ కెప్టెన్ అంజిక్యా రహానే 13 పరుగులు చేసి ఔటయ్యారు.