AP IAS Transfers: రాష్ట్రంలో 21 మంది ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఎన్నికలు జరుగుతున్న వేళ భారీగా ఐఏఎస్ ల ను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం కలెక్టర్ బాలాజీ రావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. ఈ క్రమంలో నంద్యాల కలెక్టర్ మంజీర్ జిలానీ శ్రీకాకుళం కలెక్టర్ గా బదిలీ అయ్యారు. తిరుపతి కలెక్టర్ గా లక్ష్మీషా బదిలీ అయ్యారు.
బదిలీ అయిన ఐఏఎస్ లు ఇలా
హౌసింగ్ కార్పోరేషన్ ఎండీగా తిరుపతి కలెక్టర్ వెంకట్ రమణారెడ్డి
నంద్యాల కలెక్టర్ గా ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా అభిషిక్త్ కిశోర్
శ్రీకాకుళం కమిషనర్ గా తమీమ్ అన్సారియా
పార్వతీపురం జాయింట్ కలెక్టర్ గా డాక్టర్ బీఆర్ అంబేద్కర్
డిజాస్టర్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ గా రోనంకి కూర్మనాథ్
విశాఖ కార్పోరేషన్ అడిషనల్ కమిషనర్ గా కేఎస్ విశ్వనాథం
విశాఖ జాయింట్ కలెక్టర్ గా మయూర్ అశోక్
ప్రకాశం జాయింట్ కలెక్టర్ గా గోపాలకృష్ణ రోసంకి
కాకినాడ జాయింట్ కలెక్టర్ గా ప్రవీణ్ ఆధిత్య
పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ గా ఐలేఖ్య
సర్వే సెటిల్ మెంట్ ల్యాండ్ రికార్డ్స్ అడిషనర్ డైరెక్టర్ గా గోవిందరావు
విజయనగరం జాయింట్ కలెక్టర్ గా కార్తిక్
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా భావన
ఏపీయూఎఫ్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా హరిత
ఎస్ పీ ఎస్ నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా అదర్శ్ రాజేంద్రన్
తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా అదితి సింగ్
పబ్లిక్ ఎంటర్ ప్రైజస్ డిపార్ట్ మెంట్ కార్యదర్శిగా రేఖారాణి
Bihar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా .. సాయంత్రం కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం