శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకున్న 9 మంది మరణించారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలోని మొదటి యూనిట్ లో 4 ప్యానెల్స్ దెబ్బతిని మంటలు చెలరేగిన విషయం తెల్సిందే.
ఈ ఘటనలో లోపల చిక్కుకున్న 9 మంది మరణించారు. ఘటనా స్థలంలో మొత్తం 19 మంది సిబ్బంది ఉండగా వారిలో 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. మంటల్లో చిక్కుకుని మరణించిన వారి వివరాలు..
1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్
2.AE వెంకట్రావు, పాల్వంచ
3.AE మోహన్ కుమార్, హైదరాబాద్
4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్
5.AE సుందర్, సూర్యాపేట
6. ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, ఖమ్మం జిల్లా
7. జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్, పాల్వంచ
8,9 హైదరాబాద్కు చెందిన అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్.