మన తెలుగు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ బాహుబలితో వచ్చిన స్టార్ డం ఎంతటిదో అందరికీ తెలిసిందే. ఆ స్టార్ డం ఏమాత్రం చెక్కు చెదరకుండా అంతకంతకు పెంచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్ 100 కోట్ల తో సినిమా తీసే హీరో కాదు. కనీసం ప్రభాస్ తో ఇప్పుడు సినిమా అంటే 300 కోట్ల బడ్జెట్ కి పైగానే ఉండాల్సిందే. ఇప్పుడు ప్రభాస్ తో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ అందరూ క్యూ కట్టి ఉన్నారు. ఎప్పటి నుంచో ప్రభాస్ ఒప్పుకుంటే ధూమ్ ఫ్రాంఛైజీ లో 4 వ భాగాన్ని నిర్మించడానికి మేకర్స్ సిద్దంగా ఉన్నారట.
ఇదొక్కటే కాదు ప్రభాస్ తో సినిమా చెయ్యాలని.. డార్లింగ్ డేట్స్ కోసం చాలామంది మేకర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ప్రభాస్ చేతిలో వరసగా ఉన్న ప్రాజెక్టులలో భారీ బడ్జెట్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించబోతున్నాడు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సీత పాత్రకు ఎవరిని ఎంచుకోనున్నారన్న మాట గత కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో కీర్తి సురెష్, కియారా అద్వాని, పూజా హెగ్డే ఇలా చాలా పేర్లు వినిపించాయి.
కానీ ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ ఆదిపురుష్ లో ప్రభాస్ సరసన ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. అయితే అందరూ అనుకుంటున్నట్టు కీర్తి సురేష్, కియారా అద్వాని లాంటి స్టార్ హీరోయిన్ మాత్రం కాదు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి నటించిన కృతి సనన్ అని తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు గాని ప్రస్తుతానికైతే ఈ బ్యూటీనే ప్రభాస్ కి జంటగా మేకర్స్ ఫిక్స్ చేసినట్టు బాలీవుడ్ వర్గాలలో చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా దాదాపు 750 కోట్ల బడ్జెట్ ఈ సినిమాని నిర్మించనున్నారట.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!