NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

Lok sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన రాజకీయ పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల హామీలు ఇస్తూ.. ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలతో వాగ్వివాదానికి దిగుతున్నారు.

తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ కు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మోడీ మనసులో కేవలం హిందూ – ముస్లిం ఉందని, మతం పేరుతో దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమపై కామెంట్స్ చేసే ముందు .. వారి చరిత్ర ఏమిటో చూసుకోవాలని అన్నారు.

రీసెంట్ గా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ మేనిఫెస్టో పై సంచలన కామెంట్స్ చేశారు. వారి మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ సిద్ధాంతం ముద్ర ఉందని విమర్శించారు. దీనికి మల్లికార్జున ఖర్గే సమాధానమిస్తూ .. బీజేపీ నాయకులు ముందుగా తమ పార్టీ చరిత్ర చూసుకోవాలని అన్నారు. మతం పేరుతో వాళ్లే దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ప్రధాని మోడీ మనస్సులో కేవలం హిందూ – ముస్లిం మాత్రమే ఉందన్నారు. మతం పేరుతో దేశాన్ని విభజించడం, సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తమ మేనిఫెస్టోను వాళ్లు (బీజేపీ) సరిగ్గా చదవలేదని అన్నారు. తాము యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పామని, మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పామనీ, రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) గ్యారెంటీ కల్పిస్తామని ఇవన్నీ ముస్లిం లీగ్ లో భాగమా అని ఖర్గే ప్రశ్నించారు.

రెండు టర్మ్ లుగా దేశంలో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎలాగైనా బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంతో విపక్ష పార్టీలతో ఇండియా కూటమిగా ఏర్పడింది. తమ మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చింది.

వీటిలో ఎంఎస్పీకి చట్టపరమైన హామీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయడం, వచ్చే పదేళ్లలో జీడీపీని రెట్టింపు చేయడం, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేయడం, చైనాతో యథాతథ స్థితిని పునరుద్దరించడం లాంటి అనేక హామీలు ఉన్నాయి. అంతే కాకుండా 9 నుండి 12వ తరగతి విద్యార్ధులకు మొబైల్ ఫోన్ లు ఇవ్వడంతో పాటు జీఎస్టీని సవరిస్తామని ఆ పార్టీ వాగ్దానం చేసింది.

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N