ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సినిమా గురించి ఏదో ఒక అప్ డేట్ వస్తూనే ఉన్నది. నిజానికి అవి నిజాలా? లేక ఉత్త పుకార్లేనా? అనే విషయం మాత్రం తెలియట్లేదు.
సినిమా అనౌన్స్ చేయడమే ఆలస్యం.. ఆదిపురుష్ సినిమా కథ ఇదే. ఈ సినిమాలో హీరోయిన్ ఈవిడే. విలన్ ఇతడే. ఈ సినిమా బడ్జెట్ ఇంత.. అంటూ రకరకాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఇక ఈ సినిమా రామయణ ఇతిహాసాన్ని బేస్ చేసుకొని వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ సినిమాలో కైకేయి పాత్ర కోసం ఏకంగా బాలీవుడ్ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ను తీసుకున్నారట.
నిజానికి రామాయణంలో కైకేయి పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకే.. ఆ పాత్రకు న్యాయం చేయాలంటే ఐశ్వర్యరాయ్ కరెక్ట్ అని అనుకున్నారో ఏమో కానీ.. ఆమెను ఈ రోల్ కు సెలెక్ట్ చేసిందట మూవీ యూనిట్. శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి ప్రధాన కారణమే కైకేయి. ఆ పాత్ర చాలా బలమైనది. మరి.. కైకేయి పాత్రలో ఐశ్వర్యను తీసుకుంటారా? లేదా? అంటే మాత్రం అఫీషియల్ ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
ఇక.. ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. జిల్ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ఆ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరోసినిమా చేయనున్నారు. ఆ సినిమాలో దీపికా పదుకొనె.. ప్రభాస్ సరసన నటించనుంది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!