జాతీయ మీడియా అమరావతి ఉద్యమం పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటున్నట్లు అమరావతి అనేది ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినది మాత్రమే కాదని జాతీయ మీడియా పరిశోధనలో తేలినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన భూములు ఇచ్చిన వారిలో దాదాపు 80 శాతం వరకు దళిత మరియు బీసీ వర్గాలకు చెందిన వారు ఉన్నట్లు జాతీయ మీడియా గుర్తించిందట. పరిస్థితి ఇలా ఉండగా రాజధాని అమరావతి లోనే ఉంచాలని దాదాపు 250 రోజులకు పైగా భూములు ఇచ్చిన రైతులు ఉద్యమం చేస్తూ వస్తున్నారు.
అయితే వీరంతా మొదటినుండి చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్లని వైసిపి పార్టీ నాయకులు మీడియా సమావేశాల్లో తెగ ఊదర గొడుతున్నారు. అయితే రాజధాని ఉద్యమం చేస్తున్న వారు చాలా వరకు వివిధ వర్గాలకు చెందిన వారిని గుర్తించడం తో…. నేషనల్ మీడియా ఈ విషయాన్ని ఇప్పుడు ప్రత్యేక కథనాలు ద్వారా ప్రసారం చేస్తూ వస్తోంది. ఇది చినుకు, చినుకు పెద్ద గాలి వాన అయితే జాతీయ స్థాయిలో కదలిక వచ్చే అవకాశం ఉందని, అప్పుడు జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం డేంజర్ జోన్ లో పడే అవకాశాలు ఎక్కువ అని మేధావులు చెప్పుకొస్తున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ అర్జెంటుగా నేషనల్ మీడియా ప్రసారం చేస్తున్న వార్తలు చదివితే బాగుంటుందని సూచిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతం పరిధిలో ఉండే 29 గ్రామాలలో ఎక్కువ భూములు ఇచ్చిన రైతులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కూడా ఉన్నారని, వైసిపి ప్రభుత్వం కేంద్రాన్ని తప్పుదోవ పట్టించే రీతిలో ఉద్యమాన్ని రాష్ట్రంలో నీరుగార్చడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నట్లు నేషనల్ మీడియా పుంఖాలు పుంఖాలుగా కథనాలు ప్రసారం చేస్తూ వస్తోంది.
అమరావతి అనేది ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రాంతం కాదని, నేషనల్ మీడియా తమ పరిశోధనలో తేలింది. అంతేకాకుండా అమరావతి గ్రామాల్లో ఎక్కువగా రెడ్డి సామాజికవర్గం ప్రాబల్యం ఉన్న గ్రామాలే ఉన్నాయని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన భూములు అమరావతిలో చాలా తక్కువ అని జాతీయ మీడియా స్పష్టం చేస్తూ కథనాలు ప్రసారం చేస్తోంది. వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడంతో జగన్ నేషనల్ మీడియా వార్తల పై ఫోకస్ పెట్టకపోతే మూడు రాజధానులు ఐడియా మూలన పడటం గ్యారెంటీ అని మేధావులు చెప్పుకొస్తున్నారు.