తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ సాధిస్తున్న విజయాలు ఆయన పేరు ఢిల్లీలో డబుల్, త్రిబుల్ అవుతుంది. దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవడం తోపాటు గ్రేటర్ ఎన్నికలలో రెండో అతిపెద్ద పార్టీగా బిజెపి ఫలితాలు సాధించడంతో బండి సంజయ్ నాయకత్వం పట్ల ఢిల్లీ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్న కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కంటే కూడా అధ్యక్షుడి పీఠంలో సంజయ్ కూర్చున్న తర్వాత తెలంగాణ బిజెపి గ్రాఫ్ ఒక్కసారిగా పెరగటంతో బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేయటానికి మోడీ, అమిత్ షా ఆలోచనలు చేస్తున్నట్లు బీజేపీ రాజకీయవర్గాలలో టాక్ నడుస్తోంది.
ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికలలో అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి అగ్రనేతలు లేకుండా బండి సంజయ్ విజయం సాధించటం, ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునే విషయంలో సత్ఫలితాలు సాధించి గెలవడం తోపాటు గ్రేటర్లో కూడా అదేరీతిలో బండి సంజయ్ రాణించడంతో.. బీజేపీ అగ్రనేతలు బండి సంజయ్ ని భారీ ప్లాన్ తో రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే ఇలాంటి సమయంలో తెలంగాణలో పుంజు కోవాలి అంటే మంచి దూకుడు మీద ఉన్న బండి సంజయ్ కి చట్టబద్ధత కల్పించే ఆలోచన చేస్తున్నట్లు బిజెపి వర్గాలలో టాక్. ఎందుకంటే తెలంగాణలో పోలీసు అధికార యంత్రాంగం.. మొత్తం ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉండే పరిస్థితి ఉండటంతో పాటు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండటంతో బండి సంజయ్ ని కేంద్ర మంత్రివర్గంలో తీసుకుని ఒక స్ట్రాంగ్ నేతగా తెలంగాణలో అతనికి సెక్యూరిటీ కల్పించి పార్టీని ముందుకు నడిపించే యోచన బీజేపీ అగ్రనేతలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.