తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతున్న సంగతి తెలిసిందే. దుబ్బాక లో అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల లో వచ్చిన ఫలితాలకు టీ కాంగ్రెస్ లో ఉన్న చాలామంది నాయకులు గోడ దూకడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్టు ఇప్పటికే వార్తలు రావడం జరిగింది. అంత మాత్రమే కాక కాంగ్రెస్లో కీలక నేతగా రాణించిన విజయశాంతి ఢిల్లీలో కమలం గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే.
ఒక్క విజయశాంతి మాత్రమే కాక గూడూరు నారాయణరెడ్డి ఇలాంటివారు ఇటీవల బిజెపి తీర్థం పుచ్చుకోవటం జరిగింది. అయితే తాజాగా కమలం గూటికి మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చంద్రశేఖర్ ఈనెల 28వ తారీఖున బిజెపి లో జాయిన్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాల వారికి సమాన న్యాయం జరగడం లేదని, ఆరు సంవత్సరాలు పార్టీలో ఉన్నా కానీ వికారాబాద్ టికెట్ తనకి ఇవ్వలేదు అని తెలంగాణ ప్రజలు ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి అంటూ సంచలన కామెంట్ చేశారు.
అంత మాత్రమే కాక త్వరలోనే బిజెపిలో జాయిన్ అవుతున్నట్లు చెప్పుకొచ్చారు. త్వరలో టీ కాంగ్రెస్ ఖాళీ అవడం గ్యారెంటీ అని చెప్పుకొచ్చారు. బిజెపి పార్టీ నాయకురాలు డీకే అరుణ తనను సంప్రదించారని ఈ మేరకు అనుచరులతో మంతనాలు జరిపి అందరి నిర్ణయంతో బిజెపిలో జాయిన్ అవ్వు బోతున్నట్లు చంద్రశేఖర్ స్పష్టం చేశారు. దీంతో చంద్రశేఖర్ పార్టీ మార్పుతో ఈ కాంగ్రెస్ లో పెద్ద వికెట్ పడినట్లే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.