Breaking: ఈ నెల 31న సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం పలు ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను కూడా ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు. కేబినెట్ భేటీకి సంబంధించి అన్ని శాఖల అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి సమాచారం వెళ్లింది.
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జగన్ సర్కార్ ఈ మంత్రివర్గ భేటీలో కొత్త నిర్ణయాలను కూడా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రధాన అంశాలు ఏవి తీసుకోవాలన్న దానిపై కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. పరిశ్రమలకు భూకేటాయింపుల విషయంలోనూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇటీవల అంగన్ వాడీల ఆందోళన సందర్భంగా ఇచ్చిన హామీలపైనా కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనుంది.
TDP Srikakulam: అసహ్యంగా రోడ్డుపై తన్నులాడుకున్న తెలుగు తమ్ముళ్లు