చాలా నెలల నుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఉత్కంఠకు గురి చేస్తున్న 3 రాజధానుల విషయం నేడు ఒక కొలిక్కి వచ్చేలా ఉంది. రెండుసార్లు తనకున్న అశేష మెజారిటీతో శాసనమండలిలో రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఆమోదింపజేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసన మండలిలో చంద్రబాబు కి మెజారిటీ ఉండడం వల్ల అక్కడ ఎదురు దెబ్బ తిన్నాడు. అయితే ఇప్పుడు చాలా తెలివిగా గవర్నర్ వద్దకు రాజధాని వికేంద్రీకరణ బిల్లు మరియు సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుని ఆమోదం కోసం పంపి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశతో వేచి ఉన్నాడు.
ఇదిలా ఉండగా ఆ రెండు బిల్లులను పరిశీలిస్తున్న గవర్నర్ కు విపక్షాలు కూడా వాటికి వ్యతిరేకంగా లేఖ రాశాయి. ఇక నిన్న రాత్రి విజయవాడలోని రాజ్ భవన్ కు గ్రేహౌండ్ స్పెషల్ పోలీస్ ఫోర్సెస్ వెళ్లినట్లు సమాచారం వచ్చింది.ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా…. రాష్ట్ర రాజధాని విషయంలో గవర్నర్ నిర్ణయం తీసుకున్న తర్వాత తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఎప్పుడెప్పుడు గవర్నర్ తన నిర్ణయాన్ని బయటకు చెబుతాడో అని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో ఇలా పోలీసులు వచ్చి రాజ్ భవన్ కు కాపలా కాస్తూ ఉండడంతో టిడిపి వర్గాల్లో…. పార్టీ వైసిపి వర్గాల్లో కూడా గుబులు మొదలైంది. గవర్నర్ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నాడో ఎవరికీ దిక్కు తోచట్లేదు.
గట్టిగా చెప్పాలంటే ఇప్పుడు రాష్ట్రంలో వైసిపికి ఉన్న బలం ఎక్కువ. వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చినట్లైతే వెంటనే విపరీతమైన ఉద్రిక్త పరిస్థితులు రాష్ట్రంలో మొదలవుతాయి. ముఖ్యంగా రాజ్ భవన్ లోని గవర్నర్ ను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టిడిపి వారిని తీసిపారేయలేము కానీ ఈ మధ్యన జరిగిన పరిస్థితులు చూస్తుంటే వైసీపీ వారికి వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం ఉండబోతోందని మరియు బలగాలను కూడా అందుకే పిలిపించి ఉంటారని అందరూ ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆ పరిస్థితుల్లో గవర్నర్ తెలివిగా మూడు రాజధానులు బిల్లును తిరస్కరించి సీఆర్డీఏ చట్టం రద్దుకి ఆమోదం ప్రకటించే అవకాశాలూ లేకపోలేదు. ఏదేమైనా ఈ రోజు రాత్రి జగన్, చంద్రబాబు తో పాటు గవర్నర్ కూడా రేపు రాష్ట్ర ప్రజల నుండి మరియు అధికార విపక్షాల నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండబోతోందని ఫుల్ టెన్షన్ తో ఉండి ఉంటారు.