(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: జనవరి ఒకటవ తేదీ నుంచి ఆర్టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి ఒకటవ తేదీని ఆర్టిసి ఉద్యోగుల అప్పాయింటెడ్ డేగా పరిగణించనున్నట్టు ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొన్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కార్మికులను ప్రభుత్వంలో విలీనం) చట్టం 2019 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా రవాణా విభాగం ఉద్యోగులుగా ఆర్టిసి కార్మికులను పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి నుంచి ఆర్టిసి కార్మికులు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఖజానా నుంచి నేరుగా జీతాలు అందుకోనున్నారు.