Sunaina: సునైనా..కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. టాలీవుడ్ ప్రేక్షకులకి బాగానే సుపరిచితురాలు. ఆ మధ్య విజయ్ ఆంటోనీ నటించిన సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చూడగానే ఆకట్టుకునే అందం, తెలుగమ్మాయి ఫ్యూచర్స్ టాలీవుడ్ మేకర్స్ కూడా దృష్టి పెట్టారు. అయితే కరోనా కారణంగా ఈమె నటించిన సినిమా విడుదల బాగా ఆలస్యం అయింది. మన మేకర్స్ ఒక హీరోయిన్ కి మంచి హిట్ దక్కిందంటే ఆమెనిలక్కీ హీరోయిన్గా పరిగణలోకి తీసుకుంటారు. అంతేకాదు తమ సినిమాలలో నటించమని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ లాక్ చేసుకుంటారు. ఇప్పుడు సునైనా వెనకాల కూడా టాలీవుడ్ నిర్మాతలు అలానే పడుతున్నారట.
ఇటీవల సునైనా..టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన రాజ రాజ చోర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు అందరు సునైనా గురించే చర్చించుకుంటున్నారట. వాస్తవంగా సునైనా 2005 లోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. 2006 యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన టెంథ్ క్లాస్ అనే సినిమాతో హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. చెప్పాలంటే ఈ సినిమాతో ఆమెకి మంచి పాపులారిటీ వచ్చింది. ఇక్కడ వరుసగా ఆఫర్స్ రాకపోవడంతో కోలీవుడ్ కి వెళ్ళింది.
Sunaina: రాజ రాజ చోర ఆ బ్యూటీకి మంచి కం బ్యాక్ మూవీగా నిలిచింది.
అక్కడ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తేరిలో అవకాశం అందుకుంది. క్రేజీ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో మంచి పాపులారిటీ వచ్చింది. తెరరీ తర్వాత ధనుష్ తో ‘ఎనాయి నోకి పాయుమ్ తోట’ .. అవార్డ్ విన్నింగ్ ‘సిల్లు కరుపాటి’ లాంటి సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. ఈ సినిమాలు సూపర్ హిట్ అవడంతో కోలీవుడ్ లో క్రేజీ హీరోయిన్గా మారింది. ఇక తాజాగా తెలుగులో నటించిన రాజ రాజ చోర ఆ బ్యూటీకి మంచి కం బ్యాక్ మూవీగా నిలిచింది. ఇప్పుడు యంగ్ హీరోల సరసన నటించే అవకాశాలు సునైనాకి వస్తున్నాయట. త్వరలో తన కొత్త ప్రాజెక్ట్స్ను వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!