సాధారణంగా బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా వివిధ కంపెనీలు ప్రతిభ ఉన్నా విద్యార్థులను ఎంపిక చేసుకొని ఉద్యోగాలు ఇస్తాయి..! అయితే ఈ సంవత్సరం కరోనా కారణంగా అటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏమి జరగలేదు.. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ విప్రో బీఈ, బీటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఎలైట్-2021 పేరుతో పరీక్షలు నిర్వహిస్తుంది..! ఈ పరీక్షలో ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి వారికి రూ.3.5 లక్షల వార్షిక వేతనాన్ని ఇవ్వనుంది..! పూర్తి వివరాలు ఇలా..
హోదా : ప్రాజెక్ట్ ఇంజనీర్
అర్హతలు :
60 శాతం మార్కులతో పదో తరగతి ,ఇంటర్మీడియట్, 65 శాతం మార్కులతో బీఈ ,బీటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేసిన వారు అర్హులు.
గమనిక :
ఏడాదిపాటు సంస్థలో కొనసాగడం తప్పనిసరి.
ఎంపిక విధానం:
ఆన్లైన్ అసెస్మెంట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆప్టిట్యూడ్, రిటర్ కమ్యూనికేషన్, ఆన్లైన్ ప్రోగ్రామింగ్ ఈ మూడు విభాగాలలో 128 నిమిషాల వ్యవధితో పరీక్షను నిర్వహిస్తారు. ఆప్టిట్యూడ్ టెస్ట్ వ్యవధి 48 నిమిషాలు. రిటర్ కమ్యూనికేషన్ లో 20 నిమిషాల్లో వ్యాసం రాయాలి. ఆన్లైన్ ప్రోగ్రామింగ్ కోడింగ్ లో 60 నిమిషాలలో రెండు ప్రోగ్రాం లు చేయాలి. వీటన్నింటిలో ఉత్తీర్ణత సాధించిన వారికి టెక్నికల్, హెచ్ఆర్ ఇంటర్వ్యూలు ఉంటాయి. అందులోనూ ప్రతిభ చూపిన వారిని శిక్షణకు ఎంపిక చేస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారిని విధుల్లోకి తీసుకుంటారు.
దరఖాస్తులకు చివరి తేదీ : 5/1/2020.
వెబ్ సైట్ : https://careers.wipro.com/elite
అసెస్మెంట్ పరీక్షల తేదీ : జనవరి 18-24 వరకు ఉంటాయి.