హైదరాబాద్: అధికార పక్షానికి గవర్నర్ నరసింహన్ పూర్తిగా సహకరించారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన హైదరాబాద్లోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ను కలిశారు.
ఈ సందర్భంగా ఎన్నికల రోజున గుంటూరు జిల్లా ఇనిమెట్ల పోలింగ్ కేంద్రంలో తనపై జరిగిన దాడి, తదనంతర పరిణామాలను కోడెల గవర్నర్కు వివరించినట్లు తెలుస్తోంది.
ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కోడెల..నవ్యాంధ్రకు గవర్నర్గా ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నరసింహన్ను కలిసి ధన్యవాదాలు తెలిపానన్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హింస ఎక్కువగా జరిగిందని కోడెల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో పోలీసు సిబ్బంది కూడా తక్కువగా ఉన్నారని కోడెల పేర్కొన్నారు.